సంక్షేమ కార్యక్రమాలకు గత ప్రభుత్వం తో పోల్చి చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ అదనంగా ఖర్చు చేసిందేమీ లేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. గత మూడేళ్లలో రూ 5 లక్షల కోట్లు అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కోసం చేస్తున్న ఖర్చు, గత ప్రభుత్వ హయాంలో చేసిన ఖర్చును ఆయన పోల్చి విశ్లేషించారు.
వైఎస్సార్ రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ 3840 కోట్ల టాయించగాయం గతంలో ఎవరి పేరు పెట్టకుండా అన్నదాత సుఖీభవ పేరుతో ఈ పథకాన్ని అన్ని అమలు చేశారని గుర్తు చేశారు. జగనన్న విద్యా దీవెన పథకానికి రూ 500 కోట్లు ఎగ్గొట్టారని తెలిపారు. గతంలో ఫీజు రీయింబర్స్ మెంట్ కింద నేరుగా కాలేజీల యాజమాన్యాలకే ప్రభుత్వం డబ్బు చెల్లించే దని, రూ 500 కోట్లు చెల్లించడంలో ఆలస్యమైనా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇచ్చేవని పేర్కొన్నారు.
కానీ ప్రస్తుతం నేరుగా తల్లిదండ్రులకు ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను జమ చేస్తుండడంతో , కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లను ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని చెప్పారు. జగనన్న విద్య వసతి ఈ పథకానికి రూ 2,223 కోట్లను కేటాయించగా, కేవలం రూ 1.88 వేలకోట్లను మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. నాలుగు విడత లకుగాను, రెండు విడత లను హాంఫట్ చేశారని ఎద్దేవా చేశారు.
వసతి దీవెన పూర్తి చెల్లింపులు చేయాలని కాలేజీ యాజమాన్యాలు పట్టుబడుతున్నాయని అని చెప్పారు. వై ఎస్ ఆర్ , పిఎం ఫసల్ బీమా యోజన అనే పథకం, ఇది పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి పేరు మార్పని ఎద్దేవా చేశారు. ఈ పథకం ద్వారా కొత్తగా రూ 247 కోట్లు ఇచ్చారని అనుకుందామని వ్యాఖ్యానించారు. వైయస్సార్ కాపు నేస్తం పథకంకు రూ 500 కోట్ల బడ్జెట్ ను కేటాయించారని పేర్కొన్న రఘురామ, గతంలో ఈ పథకం ద్వారా కాపు విద్యార్థులకు ఎంతో మేలు జరిగిందని, ఈ పథకానికి నిధుల కోత విధించారని చెప్పారు.
వాహన మిత్ర పథకానికి కొత్తగా విధులు కేటాయించినప్పటికీ, రోడ్డు సక్రమంగా లేకపోవడంతో వారికి అదనపు ఖర్చు తప్పడం లేదన్నారు. మత్స్యకార భరోసా రూ 120 కోట్లనీ, గతంలోనూ అంతే ఉన్నదని, కొత్తగా ఇచ్చింది ఏమీ లేదన్నారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీకి గత ప్రభుత్వంలో 40, 50 కోట్లు ఖర్చు చేయగా, ప్రస్తుతం అంతే చేస్తున్నారని, అయితే బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా ఈ మొత్తాన్ని అందజేస్తున్నారని పేర్కొన్నారు.
జగనన్న లా నేస్తం ద్వారా రూ 16 కోట్లు కొత్తగా ఇచ్చారని చెప్పుకొచ్చారు. వైయస్సార్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయడానికి ప్రతియేటా రూ 6,400 కోట్లు చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించిందని, నాలుగేళ్లలో రూ 25,500 కోట్లను ఖర్చు చేస్తామని చెప్పారని గుర్తు చేశా రు. అయితే రెండేళ్లపాటు రూ 6,400 చొప్పున ఇచ్చారని, ఈ పథకం , అప్పు చేసిన వారికే ఉపయోగపడుతుందని తెలిపారు. జాగ్రత్తగా, పొదుపుగా ఉండే వారికి ఈ పథకం వల్ల ప్రయోజనం శూన్యమని అన్నారు.
గత ప్రభుత్వం డాక్రా మహిళల కోసం రూ 22 వేల కోట్లు సహాయం చేసిందని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు.. ఒక ప్రభుత్వం చెప్పుకోలేదు కానీ, డ్వాక్రా మహిళలకు రెండు విడతలుగా రూ 22 వేల కోట్లు చెల్లించార ని , అప్పు చేసిన మహిళలకు, అప్పు చేయని వారికి కూడా చెల్లించార ని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కంటే, మా ప్రభుత్వం అదనంగా చెల్లించింది, అప్పు చేసిన వారి కోసం రెండు వేల కోట్లు అని ఆయన అన్నారు.
ఒకవేళ రేపు ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పడితే, ఎంతవరకు చెల్లిస్తారన్నది ప్రశ్నార్ధక మేనని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. వైయస్సార్ చేయూత పథకం గురించి మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో ఒకోక్క బీసీ , ఎస్సీ కార్పొరేషన్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి చేతి పనిముట్లను అందించే వారిని గుర్తు చేశారు.
ప్రతి ఏడాది నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయించేవారన్న ఆయన, ఇప్పుడు మా పథకాలన్నీ ఎత్తివేసి మహిళా చేయూత అంటూ 45 ఏళ్లు నిండిన వారికి పనిముట్లు ఇవ్వకుండా, వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించకుండా, ఏడాదికి 16 నుంచి 18 వేలు ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు. దీని వల్ల ప్రయోజనం ఏమిటి అన్నది తర్వాత చర్చిద్దామని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
అమ్మ ఒడి అనే పథకాన్ని కొత్తగా పెట్టారని, తొలుత ఇద్దరు పిల్లలు ఉన్న వారికి సహాయం చేస్తామని చెప్పారని పేర్కొన్నారు. ఆ తర్వాత మాట మార్చి కేవలం ఒక పిల్లవాడు ఉన్నవారికి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు చెప్పుకొచ్చారని గుర్తు చేశారు. ఈ పథకం కింద రూ 6,500 కోట్లను సక్సెస్ ఫుల్ గా ఎగ్గొట్ట గలిగారని విమర్శించారు. రాష్ట్రంలో రెండు లక్షల మంది విద్యార్థులను అమ్మ ఒడి పథకం ఎగ్గొట్ట డానికి ఫెయిల్ చేశారని ఆరోపించారు.
సంక్షేమ పథకాల కోసం ఏడాదికి రూ 8,700 కోట్లు ఖర్చు చేశారని, గత మూడేళ్లుగా రూ 18 వేల కోట్లు ఖర్చు చేశారని అనుకుంటే, పాత అప్పులతో కలుపుకొని టిడిపి ప్రభుత్వ హయాంలో మూడు లక్షల కోట్ల అప్పులు చేయగా, ఈ మూడేళ్లలోనే మా ప్రభుత్వం ఐదులక్షల కోట్ల అప్పు చేసి, రూ 8 లక్షల కోట్ల కు అప్పుల ను చేర్చిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
అప్పు చేసిన మొత్తం డబ్బు ఏమైందని సి ఏ జి వాళ్లు అడిగినా కూడా వివరాలు చెప్పడం లేదన్నారు. అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాలోకి నేరుగా డబ్బులు జమ చేయడం వెనుక మద్యం ఆదాయం పెంచుకోవడానిలేనని స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ, పర్సనల్ ఆదాయాన్ని పెంచుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడీ ఆడుతున్న వికృత క్రీడ ఇది అని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ 35,000 కోట్ల మద్యం ఆదాయాన్ని పొందుతూ, ఎన్ని మార్లు కోట్లు చెప్పినా కూడా డిజిటల్ కరెన్సీ ని ప్రవేశపెట్టడం లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఐ ఏ ఎస్ చదవడానికి ఎవరైనా ముందుకు వస్తే వారికి అకాడమిక్ ఖర్చుల నిమిత్తం లక్షన్నర రూపాయలు ప్రభుత్వం సహాయం చేసేదని, ప్రస్తుతం అటువంటి సహాయ మేది అందజేయడం లేదన్నారు.
గతంలో పేదింటి ఆడపిల్లలు పెళ్లిళ్లకు సహాయం చేసే వారిని, మా ప్రభుత్వం లో పేర్లు పెట్టడం తప్ప సహాయం చేసింది లేదన్నారు. పీజీ విద్యార్థులు చదువు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 60 శాతం నిధులను కూడా, అమ్మ ఒడి పథకం అమలు ద్వారా రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని అని విమర్శించారు. ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఎస్సీ ఎస్టీ బిసి, మైనారిటీల ఆశయాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూకటివేళ్లతో పెకలించిందని రఘురామకృష్ణంరాజు విరుచుకుపడ్డారు.