ఇంటర్నెట్ కేవలం అవసరమైన సమాచారం సులభంగా తెలుసుకొనే వేదికగానే కాకుండా ఆత్మహత్యలకు, నేరాలకు పాల్పడే వారికి ఓ గైడ్ గా కూడా సహకరిస్తున్నట్లు పలు ఉదంతాలు వెల్లడి చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడిన ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల (36) ఏవిధంగా ఆత్మహత్య చేసుకోవాలో ఇంటర్నెట్ ద్వారానే తెలుసుకున్నట్లు తెలుస్తున్నది.
ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన ప్రత్యూష 10 రోజుల ముందు నుంచే దానికి మానసికంగా సిద్ధం అయినట్టు తెలుస్తోంది. అయితే, నొప్పి తెలియకుండా, ఎట్లాంటి బాధా కలగకుండా సులభంగా చనిపోవడం ఎలా అనే దానిపై ఆమె ఇంటర్నెట్లో వెతికి పలు వివరాలు సేకరించినట్టు చెబుతున్నారు.
కార్బన్ మోనాక్సైడ్ను పీల్చడం ద్వారా అయితే ఎట్లాంటి బాధ లేకుండా సులభంగా చనిపోవచ్చని తెలుసుకొని అది కొనుగోలు చేసినట్లు వెల్లడైనది. అయితే దానిని ఎక్కడి నుంచి కొనుగోలు చేసిందనే విషయంపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు.
కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకోవడం కుదరదని భావించిన ప్రత్యూష దానికి తన బొటిక్ను సరైన ప్రదేశంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక.. ఆత్మహత్యకు వారం రోజుల ముందు బాత్రూంలోని కిటికీలు, ఎగ్జాస్టర్ ఫ్యాన్ ప్రాంతాన్ని పూర్తిగా మూసి చేయించినట్టు పోలీసులు గుర్తించారు.
మొన్నటి శుక్రవారం ఉదయం రెండు సార్లు బయటకు వెళ్లిన ఆమె సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో తిరిగి వచ్చారు. ఆ సమయంలో ఆమె వద్ద పనిచేసే దుర్గకు తాను కిరాణా షాపుకు వెళ్తున్నానని ప్రత్యూషకు చెప్పినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
దీంతో తన పనిమనిషిని వెళ్లమని చెప్పిన ఆమె తాను పిలిచేదాకా లోపలికి రావొద్దని చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తర్వాతి రోజు ఉదయం గది నుంచి ప్రత్యూష బయటకు రాకపోవడంతో దుర్గ దంపతులు తలుపు తట్టినా తీయలేదు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రత్యూష తండ్రి, డ్రైవర్ వచ్చినట్టు దుర్గ, ఆమె భర్త వీరబాబు పోలీసులకు తెలిపారు.
ఒంటరితనం, డిప్రెషన్ కారణంగానే ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రత్యూష తన పరిస్థితిని మొత్తం స్నేహితులకు షేర్ చేసినట్లు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేగాక ఓ ప్రముఖ హీరోయిన్తో ప్రత్యూష చివరిసారిగా మాట్లాడినట్లు గుర్తించారు.
చార్కోల్ గ్రిల్లో కార్బన్ మోనాక్సైడ్ రసాయనాన్ని ఉంచి మంటను రగిలించడం ద్వారా వచ్చే పొగను పీల్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బిల్డింగ్ సెల్లార్లోని బెడ్రూమ్లో రెండు గ్రిల్స్లో కార్బన్ మోనాక్సైడ్ను మండించి సోఫాలో పడుకొని ప్రాణాలు వదిలినట్లు పేర్కొన్నారు.
‘నేను కోరుకున్న జీవితం ఇది కాదు అందుకే వెళ్ళిపోతున్నాను’ అంటూ పోలీసులకు దొరికిన ఆత్మహత్య ముందుటి లేఖలో ఆమె పేర్కొంది. గత కొంత కాలంగా ప్రత్యూ తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. డిప్రెషన్ నుంచి బయటకు రాలేక తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ప్రత్యూష నుంచి సుసైడ్ నోట్, పెన్డ్రైవ్, సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ను పోలీసులు సీజ్ చేశారు. ఎఫ్ఎస్ఎల్కు శాంపిల్స్ను వైద్యులు పంపారు. ఐఆర్ఎస్ కుమార్తె అయిన ప్రత్యూష ఫ్యాషన్ డిజైనర్ రంగంలో రాణిస్తున్నారు. దేశంలో 30 మంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లలో ఆమె ఒకరు. దాదాపు టాలీవుడ్, బాలీవుడ్ సినీ తారలకు ఫ్యాషన్ డిజైనర్గా పనిచేశారామో.