ప్రస్తుతం ఉన్న 5,12, 18 మూడు రకాల శ్లాబులను కుదించి రెండే ఉండాలన్న దానిపై చర్చలు కొనసాగుతున్నాయని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలన్న డిమాండ్ ఉందని, దీనిపై కొంత వ్యతిరేకత ఉందని చెబుతూ ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి మరికొంత కాలం పట్టవచ్చని ఆయన పేర్కొన్నారు.
పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే, రాష్ట్రాలు కోల్పోయో ఆదాయంపై స్పష్టత రానంత వరకు దీనిపై ఏకాభిప్రాయం సాధ్యం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని రెవెన్యూ కార్యదర్శి కూడా దృవీకరించారు ఈ విషయంలో కేంద్ర, రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
ఆదాయాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్న మన దేశంలో విలాసవంతమైన వస్తువులు, వాహనాలు, హానికరమైన వాటిపై 28శాతం జీఎస్టీ వసూలు చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేస్తూ ప్రస్తుతం ఉన్న జీఎస్టీ శ్లాబులలో అత్యధికంగా ఉన్న 28 శాతం పన్నును తొలగించే అవకాశం లేదని తెలిపారు. విలాసవంతమైన వస్తువులు, హానికరమైన వాటిపై మాత్రమే ప్రస్తుతం 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.
ఇక 5,12,18 శ్లాబుల్లో ఉన్న జీఎస్టీని రెండుగా కుదించడం, తరువాత ఒకే దేశం ఓకే తరహా పన్నుగా మారడం చాలా క్లిష్టమైన అంశమని ఆయన థెయ్ల్పారు. పైగా, ప్రత్యేకంగా బంగారం, నగలపై విలువైన రాళ్లపై ప్రస్తుతం 3 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఒక డైమండ్స్, అన్కట్ డైమండ్స్పై 1.5 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. 28 శాతం వసూలు చేస్తున్న జీఎస్టీ నిధులు ప్రత్యేక కార్పస్ ఫండ్కు జమ చేస్తున్నాట్లు రెవెన్యూ కార్యదర్శి తెలిపారు.
జీఎస్టీ వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు ఈ నిధులను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. జీఎస్టీ పన్నుల్లో మార్పులు, శ్లాబుల సవరణ, జీఎస్టీ పరిధిని ఎలాంటి వాటికి మినహాయింపులు ఇవ్వాలన్న అంశాలపై అధ్యాయనం చేసి ఒక నివేదిక ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్ కర్నాటక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని నియమించింది.
ఈ కమిటీ తన తుది నివేదిక ఇచ్చేందుకు మరో మూడు నెలల గడువు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. జీఎస్టీని అమల్లోకి తీసుకు రావడానికి ముందు వేసిన సుబ్రమణియన్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం సహజమైన పన్ను రేటు 15.5 శాతం ఉండాలని సూచించింది.
ఇటీవల ఆర్బీఐ జరిపిన అధ్యయనం ప్రకారం జీఎస్టీ ప్రారంభంలో ఉన్న 14.4 శాతం పన్ను రేటు ప్రస్తుతానికి 11.6 శాతంగా ఉందని పేర్కొంది. ముంత్రుల కమిటీ నివేదిక ప్రకారం గత నెల 28,29 తేదీల్లో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ పలు వస్తువులపై ఉన్న జీఎస్టీ మినహాయింపులను తొలగించింది.
రెవెన్యూ రేటు 15.5 శాతం ఉండాలన్న లక్ష్యాన్ని తీసుకుంటే ముందు ముందు జీఎస్టీ రేట్లు పెరగడం ఖాయం. మరికొన్ని వస్తువులు, సేవలు జీఎస్టీకి తీసుకు రావాల్సి ఉంటుంది. దీనిపై స్పందించిన రెవెన్యూ కార్యదర్శి విధాన నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉందని తెలిపారు. విధాన నిర్ణయాలు చేసే వారు దృష్టి ఎలా ఉంటుందో చూడాలని పేర్కొన్నారు. 15 శాతం ఆదాయం లక్ష్యంగా ఉంటే కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుందని చెప్పారు.