కాకతీయుల వంశం ప్రతాపరుద్రునితో ముగిసిపోయిందని అనుకుంటే వారి వారసులు ఇంకా సజీవంగా ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం 22వ వారసుడిని నేడు వరంగల్ నగరానికి తీసుకురావడం ద్వారా రుజువు చేసింది. ‘కాకతీయ వైభవ సప్తాహం’ పేరుతో నేటి నుంచి ఏడు రోజుల పాటు ప్రభుత్వం వరంగల్లో నిర్వహించనున్న ఉత్సవాల సందర్భంగా కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర బంజ్ దేవ్ నేడు సప్తాహాలను ప్రారంభించనున్నారు.
ఈ వేడుకలను ప్రారంభించేందుకు కమల్చంద్ర భంజ్దేవ్ వరంగల్ కు చేరుకున్నారు. ఈ సందర్బంగా మంత్రులు శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్లు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన హన్మకొండ లోని శ్రీ భద్రకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు.
ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మొట్టమొదటిసారి ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచనాలు అందించారు. తమ పూర్వపు రాజవంశీయున్ని చూసేందుకు ఓరుగల్లు వాసులు భారీగా తరలి వచ్చారు.
ఓరుగల్లును కేంద్రంగా తీసుకుని పరిపాలనాచేసిన కాకతీయ రాజులు ప్రతాప రుద్రునితో వారి శకం ముగిసిందని 800 వందల ఏళ్ల చరిత్రను చెప్పుకుంటూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన చరిత్ర ప్రధానంగా వారు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల నిర్మాణం నేటికి చెదరకుండా ఉన్నాయి.
ముఖ్యమంత్రి కెసిఆర్ సాగునీటి వనరులను అభివృద్ధి పరచాలనే ఉద్దేశ్యం తో కాకతీయుల నిర్మించిన చెరువుల పూడికతీతకు మిషన్ కాకతీయ పేరుతో ఆ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడం అనుకున్న లక్ష్యం నెరవేరింది. అప్పటినుండి కాకతీయుల చరిత్ర వారి వంశంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితం చత్తీస్ఘడ్ రాష్ట్రంలో వారి వారసులు ఉన్నట్లు తెలుసుకోగలిగింది.
గణపతి దేవుని ఆధ్వర్యంలో రాణిరుద్రమ, ప్రతాప దేవుడు వరంగల్ ప్రాంతాన్ని సాగునీటి రంగంలో అగ్రగామిగా నిలపడం వలన వారి చరిత్ర ఈ ప్రాంతంలో మధ్యతరహా ప్రాజెక్ట్లైన రామప్ప, లక్నవరం, పాకాల, గణపురం చెరువుల రూపంలో సజీవంగా నిలిచింది. కాకతీయుల వారసులు నేటికీ ఉన్నారని తెలియడంతో ఈ ప్రాంత ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.
వాస్తవానికి 18వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల చేతిలో బందీ అయిన ప్రతాప రుద్రుడుని తీసుకుని వెళుతుండగా కాళేశ్వరం నదీ పరివాహకంలో అదృశ్యమైనట్లు చరిత్ర చెబుతుంది. అతని ద్వారానే కాకతీయుల వంశం చత్తీస్ఘఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో మరో సామ్రాజ్యాన్ని నిర్మించినట్లు ఆధారాలు కనబడుతున్నాయి.
ఓరుగల్లు రాజ్యాన్ని విడిచిన తర్వాత బస్తర్ను కేంద్రంగా చేసుకుని వారి సామ్రాజ్య పరిపాలన కొనసాగిస్తూ వచ్చారు. రాజరిక పరిపాలనను సమాప్తం చేసిన తరువాత వారు అదే ప్రాతంలో ఉండి ఆ ప్రాంత ప్రజలకు వారికి ప్రత్యక్ష దేవుళ్లుగా సేవలు అందింస్తున్నారు.
కాకతీయ వారసులు వరంగల్ కు వస్తున్నారన్న సమాచారాన్ని తెలుసుకుని ఇక్కడి ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. దాదాపుగా 15 రోజులుగా కాకతీయ వారసులు వరంగల్కు వస్తున్నారంటే ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లను చేపట్టింది. 800 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్షంగా కమల్చంద్ర బంజ్దేవ్ వరంగల్లో అడుగుపెట్టడం ముగిసిన చరిత్రకు తెలంగాణ ప్రభుత్వం మళ్లీ నూతన చరిత్రను లిఖించబోతుందని మేథావులు సైతం అంటున్నారు.
కాకతీయుల సామ్రాజ్యంలో సాగునీటి రంగం అద్భుతమైన ఫలితాలను చూపించినందున అదే స్ఫూర్తితో కాకతీయ వారసులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందంటున్నారు.