తెలంగాణ రాష్ట్రంలో ఏ హిందువుకు ఆపద వచ్చినా ఆదుకునేందుకు బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సిద్ధంగా ఉందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ భరోసా ఇచ్చారు. తెలంగాణలోని ఏ హిందువుకు ఆపద వచ్చినా వీహెచ్పీ హెల్ప్లైన్ నంబర్ 91107 65545కు ఫోన్ చేయాలని సూచించారు.
ఆదుకునేందుకు బజరంగ్దళ్, వీహెచ్పీ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ధర్మ రక్షణ కోసం నిరంతరం ( అర్ధరాత్రి అపరాత్రి) అన్నివేళలా హిందువులకు అండగా ఉంటామని చెబుతూ బుధవారం పౌర్ణమి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో హిందూ హెల్ప్ లైన్ ప్రారంభించారు.
ఇతర మతస్తుల దుర్మార్గాల నుంచి హిందూ సమాజాన్ని కాపాడుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. గోరక్ష, లవ్ జిహాద్, మత మార్పిడి, దేవాలయాల భూముల కబ్జా, హిందూ జీవన విధానంపై సాంస్కృతిక దాడులు.. ఇలా అనేక రంగాలపై ఇతర మతస్థులు చేస్తున్న హింస నుంచి హిందూ సమాజాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు.
అక్రమంగా గోవులను తరలిస్తే, ప్రేమ పేరుతో అమ్మాయిలను వలలో వేసుకొని మతం మారిస్తే, సేవా ముసుగులో మతమార్పిడులకు పాల్పడుతున్న వ్యవహారాలు, దేవాలయాల భూముల కబ్జాలు .. ఇవన్నీ మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు అయినా ఎదుర్కోవడానికి ఎవరు సహాయం చేయడం లేదని చెప్పారు.
కాబట్టి ఇటువంటి సంఘటనలు తమ పరిధిలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే వెంటనే విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయానికి హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని, వాటిని ఎదుర్కొనేందుకు విశ్వహిందూ పరిషత్ నిరంతరం పోరాటం సాగిస్తుందని చెప్పారు.
హిందూ సమాజంలో ఒకరి సమస్యలు ఒకరు పట్టించుకోవడంలేదని, పక్కవారు ఇబ్బంది పడుతున్న కూడా చూస్తూ వెళ్లిపోయే తత్వం నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని పేర్కొంటూ ఒకరికి ఒకరు అండగా ఉంటేనే చైతన్యం కలుగుతుందని హితవు చెప్పారు. అలా చేయని పక్షంలో కనీసం విశ్వహిందూ పరిషత్ కార్యాలయానికి ఫోన్ చేసి సమస్యను చెప్పాలని హెల్ప్ లైన్ ప్రారంభించామని పేర్కొన్నారు.
దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటే కూడా విశ్వహిందూ పరిషత్ స్పందిస్తుందని ఆయన చెప్పారు. ఉదాహరణకు అమర్నాథ్ యాత్రలో అనుకోని విపత్తు చోటుచేసుకున్నా, లేదా కేదరినాథ్, కాశీ, మధుర , తిరుపతి లాంటి వివిధ పుణ్యక్షేత్రాలలో కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తిన హెల్ప్ లైన్ స్పందిస్తుందని తెలిపారు.
పౌర్ణమి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి ముడుపు యాదిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ రామ్ సింగ్, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, మాతృశక్తి రాష్ట్ర కన్వీనర్ పద్మశ్రీ పాల్గొన్నారు