భారత సంతతికి చెందిన ప్రఖ్యాత రచయిత సల్మాన్ రష్దీపై (75) శుక్రవారం అమెరికాలో దాడి జరిగింది. కత్తిపోట్ల కు గురయ్యారు. న్యూయార్క్ సాహిత్య ఉత్సవంలో (లిటరరీ ఫెయి ర్) ఆయన ఓ ప్రసంగ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక్కడి చౌటాయూక్యూ సంస్థలో స్టేజీపైకి వచ్చి ప్ర సంగించనుండగా ఓ వ్యక్తి వచ్చి ఆయనను కత్తితో పొడిచారని, అంతా చూస్తూ ఉండగానే 10 నుంచి 15 సార్లు కత్తితో పొడిచారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
వెంటనే ఆ వ్యక్తిని అడ్డుకున్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. దాడి వివరాలు పూర్తిగా వెంటనే తెలియలేదు. వేదికపై పడిపోయిన రష్దీని వెంటనే అక్కడినుంచి కిందకు తీసుకువెళ్లి, ఓ హెలికాప్టర్లో న్యూయార్క్ సిటీలోని ఓ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. నిందితుడ్ని న్యూజెర్సీకి చెందిన హదీ మటర్(24)గా గుర్తించారు.
సల్మాన్ రష్ది ఓ కన్ను కోల్పోయే అవకాశాలున్నాయని ఆయన బుక్ ఏజెంట్ ఆండ్రూ వైలీ ఓ మీడియా సంస్థకు తెలిపారు. వైలీ తెలిపిన వివరాల ప్రకారం.. సల్మాన్కు గంటల తరబడి శస్త్రచికిత్స అనంతరం వెంటిలేటర్పై ఉంచారు. చేతులోని నరాలు సైతం తెగిపోయాయని, కత్తిపోట్లకు కాలేయం దెబ్బతిన్నదని చెప్పారు.
సటానిక్ వర్సెస్ పుస్తక రచనతో 1980 నుంచి ఆయనకు ప్రాణాలు తీస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఇరాన్ ఫత్వా వెలువరించిన 33 సంవత్సరాలకు ఈ రచయితపై దాడి జరిగింది. ఇస్లాం వ్యతిరేక భావనలతో సటానిక్ నవల రాశారని పేర్కొంటూ ఇరాన్ ఇతర దేశాలలో దీనిని నిషేధించారు.
రష్దీ ఇప్పుడు అమెరికాలో ప్రవాసంలో ఉంటున్నారు. వేదికపై దాడికి గురై, సల్మాన్ రష్దీ వేదికపై కిందపడ్డారు. భారతీయ సంతతికి చెందిన రష్డీ బ్రిటిష్ పౌరసత్వం పొందారు. గత 20 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నారు. ఆయనను హత్య చేసిన వారికి 3 మిలియన్ డాలర్ల రివార్డును ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. దాడి ఘటనపై వెంటనే లండన్లోని రష్దీ కుమారుడు జాఫర్ తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.
ఆయనపై జరిగిన కత్తి దాడి తనను భయభ్రాంతులకు, దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన గాయం నుండి పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీన్ని విచారకరమైన రోజుగా అభివర్ణించారు. సృజనాత్మక వ్యక్తీకరణ ఇకపై స్వేచ్ఛగా, బహిరంగంగా ఉండకపోతే అది అధాన్వంగా ఉంటుందని హెచ్చరించారు.