త్వరలోనే జియో కంపెనీ 5జీ ఫోన్ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇప్పటికే 5జీ ఫోన్కు సంబంధించిన పనులపై కంపెనీ దష్టి సారించినట్లు, దసరా లేదా ఈ ఏడాది చివరినాటికి జియో 5జీ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేస్తారని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
గతేడాది విడుదల చేసిన జియో ఫోన్ నెక్ట్స్ రూ.5 వేలకే ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉండటంతో యూజర్లు ఆసక్తి కనబరిచిన విషయం తెలిసిందే. త్వరలోనే వచ్చే 5జీ ఫోన్లో ఫీచర్లు, దాని ధరపై ఇప్పుడు చర్చ మొదలైంది.
- జియో 5జీ ఫోన్ ధర విషయానికొస్తే రూ. 10 వేల నుంచి రూ. 12 వేల మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా.
- డిస్ప్లే విషయానికి వస్తే 6.5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది.
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఛార్జింగ్కు సపోర్టు చేస్తుంది. 4 జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత స్టోరేజీ వేరియంట్లో తీసుకొస్తున్నారట.
- డ్యూయల్ సిమ్, మెమొరీ కార్డు ఆప్షన్.. బ్యాక్ కెమెరా 13 ఎంపీ, 2 ఎంపీ, ఫ్రంట్ కెమెరా 8 ఎంపీ ఉంటుందట. సైడ్లో లేదా వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండచ్చని టెక్ వర్గాలు తెలిపాయి.
- గూగుల్, జియో కలిసి అభివద్ధి చేసిన ప్రగతి ఓఎస్తోనే ఈ ఫోన్ పనిచేస్తుంది. అలాగే స్నాప్డ్రాగన్ 480 5జీ ప్రాసెసర్.. స్నాప్డ్రాగన్ ఎక్స్ 51 మోడెమ్ ఉంటుంది. ఈ మొబైల్ 5 రకాల 5జీ బ్యాండ్స్ను సపోర్టు చేస్తుందని అంచనా.
- ఈ 5జి ఫోన్లో గూగుల్ యాప్స్ ఇన్బిల్ట్గా ఉంటాయి. అలాగే మై జియో, జియో టీవీ వంటి వాటితోపాటు ఉచితంగా ఇతర జియో యాప్స్ కూడా ఉంటాయి.
- జియో ఫోన్ నెక్ట్స్ తరహాలోనే యూజర్లు రూ 2,500 చెల్లించి 5జీ ఫోన్ను సొంతం చేసుకునేలా ఈఎంఐ పద్ధతి ఉంటుందని సమాచారం.