ప్రధాన మంత్రినరేంద్ర మోదీ ఆగస్టు 25న రాత్రి 8 గంటలకు ‘స్మార్ట్ ఇండియా హాకథన్ 2022’ గ్రాండ్ ఫినాలే ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. దేశంలో, ప్రత్యేకించి యువతీ యువకుల లో నూతన ఆవిష్కరణలకు సంబంధించినటువంటి స్ఫూరిని పెంపొందించేందుకు ప్రధాన మంత్రి నిరంతరం ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
ఇదే దార్శనికతను అనుసరిస్తూ, స్మార్ట్ ఇండియా హాకథన్ (ఎస్ఐహెచ్)ను 2017లో మొదలు పెట్టారు. ఎస్ఐహెచ్ అనేది సమాజం, సంస్థల, ప్రభుత్వం ఎదుర్కొనే అనేక చిక్కు సమస్యలను పరిష్కరించడాని కి విద్యార్థులకు ఒక వేదిక ను సమకూర్చేటటువంటి ఒక దేశవ్యాప్త కార్యక్రమం గా ఉన్నది. ఇది విద్యార్థులలో ఉత్పత్తి పరమైన నూతన ఆవిష్కరణ,
సమస్యను పరిష్కరించడంలతో పాటుగా అంతవరకు అవలంబిస్తున్న ఆలోచన విధానానికి భిన్నం గా సరికొత్త ఆలోచనలను చేసే సంప్రదాయాన్ని నెలకొల్పాలని ధ్యేయంగా పెట్టుకొంది. ఎస్ఐహెచ్ లో నమోదులు చేసుకొంటున్న బృందాల సంఖ్య తొలి సంచికలో సుమారు 7500గా ఉండగా, తాజా అయిదో సంచిక కు వచ్చే సరికి నాలుగింతల వృద్ధితో ఇంచుమించు 29,600కు చేరుకోవడాన్నిబట్టి ఈ కార్యక్రమానికి పెరుగుతున్న ఆదరణను గమనించవచ్చు.
ఈ సంవత్సరంలో 15,000 మందికి పైగా విద్యార్థులు, మార్గదర్శకులు ఎస్ఐహెచ్ 2022 గ్రాండ్ ఫినాలేలో భాగం పంచుకోవడం కోసం 75 నోడల్ కేంద్రాలకు చేరుకొంటున్నారు. 2900కు పైగా పాఠశాలలు, 2200 ఉన్నత విద్య సంస్థలకు చెందిన విద్యార్థులు ఫినాలేలో పాల్గొని, 53 వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి అందే 476 సమస్యలకు పరిష్కారాలను కనుగొనేందుకు కృషి చేయనున్నారు.
వీటిలో ఆలయాలకు చెందిన శిలా శాసనాలకు సంబంధించిన ఆప్టికల్ కేరిక్టర్ రెకగ్ నిశన్ (ఒసిఆర్) దేవనాగరి లిపిలోని అనువాదాలు, త్వరగా పాడయిపోయే ఆహార పదార్థాల కోసం ఉద్దేశించినటువంటి కోల్డ్ సప్లయ్ చైన్ లో ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి) ఆధారిత రిస్క్ మానిటరింగ్ సిస్టమ్, విపత్తు విరుచుకుపడ్డ వంటి ప్రాంతాలలో భూమి, మౌలిక సదుపాయాలు, రహదారుల స్థితులపై అధిక స్పష్టతతో కూడినటువంటి 3డి నమూనా మొదలైనవి కూడా ఉంటాయి.
ఈ సంవత్సరంలో, పాఠశాల విద్యార్థుల మనస్తత్వాన్ని అభివృద్ధి పరచడంతో పాటు నూతన ఆవిష్కరణల సంస్కృతిని తీర్చిదిద్దడం కోసమని పాఠశాల విద్యార్థులకు ఒక ప్రయోగాత్మక కార్యక్రమమా అన్నట్లుగా ‘స్మార్ట్ ఇండియా హాకథన్-జూనియర్’ ను కూడా ప్రవేశపెట్టారు.