ఆసియాకప్లో భాగంగా ఆదివారం పాకిస్థాన్తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో భారత్ విజృంభించింది. అన్ని విభాగాల్లో రాణించి పాక్ను చిత్తు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో లక్ష్య చేధనకు దిగిన భారత్ ఇన్నింగ్స్ను నిదానంగా ప్రారంభించింది.
నషీమ్ షా వేసిన తొలి ఓవర్ రెండో బంతికే కెఎల్ రాహుల్ డకౌటయ్యాడు. ఇదే ఓవర్లోనే విరాట్ కోహ్లి డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆఫ్సైడ్ వేసిన బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్ వైపు దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డర్ వదిలేయడంతో కోహ్లి బతికిపోయాడు.
తొలి ఓవర్ ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోయి మూడు పరుగులు మాత్రమే చేసింది. తరువాత విరాట్ కొంచెం సేపు దాటిగా ఆడ్డంతో ఏడు ఓవర్లకు భారత్ 41 పరుగులు చేసింది. అయితే తరువాత ఓవర్లోనే రోహిత్ శర్మ (12)ను మహమ్మద్ నావాజ్ పెవిలియన్కు చేర్చాడు.
ఇదే బౌలర్ 10వ ఓవర్ తొలి బంతికి దాటిగా ఆడుతున్న కోహ్లి (35 పరుగులు, 34 బంతుల్లో సిక్స్, మూడు ఫోర్లు)ను కూడా అవుట్ చేశాడు. దీంతో పది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు. క్రీజ్లో రవీంద్ర జడేజా-సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.
15వ ఓవర్లో సూర్యకుమార్ (18) నిష్క్రమించాడు. ఈ తరువాత హర్థిక్ పాండ్యతో కలిసి రవీంద్ర జడేజా వేగంగా ఆడాడు. జడేజా ధాటితో 18 ఓవర్లలో 11 పరుగులు లభించాయి. 19 ఓవర్లలో హర్థిక్ రెండు వరస ఫోర్లుతో మొత్తంగా 3 ఫోర్లు కొట్టాడు. దీంతో ఈ ఓవర్లో 17 పరుగులు లభించాయి.
చివరిలో ఓవర్లో భారత్ విజయం కోసం 7 పరుగుల చేయాల్సిన పరిస్థితి. అయితే 20 ఓవర్ తొలి బంతికి భారత్ను నవాజ్ మరోసారి భారీ దెబ్బ కొట్టాడు. ధాటిగా ఆడుతున్న జడేజా (35 పరుగులు, 29 బంతుల్లో రెండు సిక్స్లు, రెండు ఫోర్లు)ను మహమ్మద్ నవాజ్ అవుట్ చేశాడు.
ఈ దశలో హర్థిక్కు దినేశ్ కార్తీక్ జతకలిశాడు. రెండో బంతికి ఒక పరుగు లభించింది. మూడో బంతికి పరుగు రాలేదు. అయితే నాలుగు బంతికి పాండ్య సిక్స్ బాదడంతో మ్యాచ్ భారత వశమయింది. ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే, ఐదు వికెట్లతో భారత్ మ్యాచ్ను గెలుచుకుంది.
ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ సేన పాకిస్థాన్ను 147 పరుగులకే ఆలౌట్ చేసింది. భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లతో రాణించగా, హర్థిక్ పాండ్యా మూడు వికెట్లు, అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు సాధించారు.
ఆవేశ్ఖాన్ ఒక్క వికెట్ సాధించారు. దీంతో ఇంకా బంతి మిగిలిఉండగానే పాకిస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు పాక్ జట్టులో ఓపెనర్, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ మాత్రమే 43 పరుగులతో (42 బంతుల్లో సిక్స్, నాలుగు ఫోర్లు) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. తరువాత ఇఫ్తికర్ షాహ 28 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
విరాట్ కోహ్లికి ఇది 100వ టీ20 మ్యాచ్. దీంతో మూడు ఫార్మెట్లు (టెస్టులు, వన్డేలు, టీ20)ల్లోనూ వంద మ్యాచ్ చొప్పన ఆడిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికే న్యూజిలాండ్కు చెందిన రాస్టేలర్ ఈ ఘనత సాధించాడు. అలాగే, ఈ మ్యాచ్తో అంతర్జాతీ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రోహిత్ శర్మ (3,499)నిలిచాడు.