పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లోని రద్దీగా ఉండే మసీదులో శుక్రవారం పేలుడు సంభవించి, కనీసం 18 మంది మరణించారు, ఇందులో ఒక ప్రముఖ మత గురువు, తాలిబాన్ అధికారులు , స్థానిక వైద్యుడు ఉన్నారు. కనీసం 21 మంది గాయపడ్డారు.
గుజర్గా మసీదులో పేలుడు సంభవించింది. పశ్చిమ నగరంలోని హెరాత్లోని గుజార్గా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించింది. స్థానికుల కథనం ప్రకారం రహమాన్తోపాటు 20 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 200 మంది గాయపడ్డారు.
ఈ పేలుడులో గత రెండు దశాబ్దాలుగా దేశంలోని పాశ్చాత్య-మద్దతు గల ప్రభుత్వాలను విమర్శించి ఆఫ్ఘనిస్తాన్ అంతటా ప్రసిద్ధి చెందిన ప్రముఖ మత గురువు ముజీబ్-ఉల్ రెహ్మాన్ అన్సారీ మరణించారు. అన్సారీ తాలిబాన్లకు సన్నిహితుడు.
ముస్లింలకు పవిత్రమైన శుక్రవారంనాడు మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ప్రార్థనలు చేసేందుకు పెద్ద ఎత్తున ముస్లింలు హాజరైన సమయంలో ఈ పేలుడు సంభవించడంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉంది.
విదేశీ దళాలు వెళ్లిపోయాక అతడు దేశాన్ని అన్సారీ తన నియంత్రణలోకి తీసుకున్నాడు. పాశ్చాత్య దేశాల మద్దతుతో నడిచే ప్రభుత్వాలను ఆయన దుయ్యబడుతూ, విమర్శిస్తూ ఉండేవారు. అతని మరణాన్ని తాలిబాన్ చీఫ్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ధృవీకరించారు. హెరాత్ పేలుడులో 18 మృతదేహాలు, 21 మంది క్షతగాత్రులను అంబులెన్స్లు ఆసుపత్రులకు తరలించాయని హెరాత్ అంబులెన్స్ సెంటర్ అధికారి మహ్మద్ దౌద్ మొహమ్మది తెలిపారు.