దేశంలో ఆయా చట్టవిరుద్ధమైన రుణ యాప్లు వ్యవహరిస్తున్న తీరు ముఖ్యంగా బలహీనమైన & తక్కువ-ఆదాయ వర్గాలకు అధిక వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్/దాచిన ఛార్జీలు, బ్లాక్మెయిలింగ్, నేరపూరిత బెదిరింపులు మొదలైన దోపిడీ రికవరీ పద్ధతులపై రుణాలు/సూక్ష్మ క్రెడిట్లను అందిస్తున్న సందర్భాలు పెరుగుతుండటం పట్ల ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు.
సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాల వెలుపల “అక్రమ రుణ యాప్ల”కి సంబంధించిన వివిధ సమస్యలను చర్చించడానికి ఆమె అధ్యక్షతన ఒక సమావేశంలో ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక శాఖ కార్యదర్శి, రెవెన్యూ, కార్పొరేట్ వ్యవహారాలు (అదనపు ఛార్జ్) కార్యదర్శి; ఆర్ధిక సేవల శాఖ కార్యదర్శి; ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యదర్శి; ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్; ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
మనీలాండరింగ్, పన్ను ఎగవేతలు, డేటా ఉల్లంఘన/గోప్యత, అటువంటి చర్యలకు పాల్పడినందుకు క్రమబద్ధీకరించని చెల్లింపు అగ్రిగేటర్లు, షెల్ కంపెనీలు, పనికిరాని ఎన్బీఎఫ్సీలు మొదలైన వాటి దుర్వినియోగం వంటి ఆయా అవకాశాలను కూడా మంత్రి సీతారామన్ ఈ సందర్భంగా గుర్తించారు.
సమస్యకు సంబంధించిన చట్టపరమైన, విధానపరమైన మరియు సాంకేతిక అంశాలపై వివరణాత్మక చర్చల తర్వత సమావేశం వీటి నియంత్రిణ దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఆర్బీఐ అన్ని చట్టపరమైన యాప్ల యొక్క “వైట్లిస్ట్”ని సిద్ధం చేస్తుంది. మైటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ) ఈ “వైట్లిస్ట్” యాప్లు మాత్రమే యాప్ స్టోర్లలో హోస్ట్ చేయబడేలా తగిన చర్యలను చేపడుతుంది.
మనీలాండరింగ్ కోసం ఉపయోగించబడే ‘మ్యూల్/రెంటెడ్’ ఖాతాలను ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది. వాటి దుర్వినియోగాన్ని నివారించడానికి నిద్రాణమైన ఎన్బీఎఫ్సీని సమీక్షిస్తుంది/రద్దు చేస్తుంది. చెల్లింపు అగ్రిగేటర్ల రిజిస్ట్రేషన్ గడువులోపు పూర్తయ్యేలా ఆర్బీఐ నిర్ధారిస్తుంది. ఆ తర్వాత నమోదు చేయని చెల్లింపు అగ్రిగేటర్ తన కార్యకలాపాలను చేపట్ట కుండా అనుమతించదు.
ఎంసీఏ షెల్ కంపెనీలను గుర్తించి, వాటి దుర్వినియోగాన్ని నిరోధించడానికి వాటిని డి-రిజిస్టర్ చేస్తుంది. కస్టమర్లు, బ్యాంక్ ఉద్యోగులు, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు మరియు ఇతర వాటాదారులకు సైబర్ అవగాహన పెంచడానికి చర్యలు తీసుకోవాలి. కార్యకలాపాలను నిరోధించడానికి అన్ని మంత్రిత్వ శాఖలు/ఏజెన్సీలు సాధ్యమయ్యే అన్ని చర్యలను తీసుకోవాలి