న్యూజిలాండ్లోని బే ఓవల్ స్టేడియంలో న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన రెండో టీ 20లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో టీమిండియా 65 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ విజయంతో భారత జట్టు మూడు టీ20 సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ ఓపెనర్లు, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు.
న్యూజిలాండ్ గడ్డపై మిస్టర్ 360 సూర్యకుమార్ 217.65 స్ట్రైక్ రేటుతో 51బంతుల్లోనే 111 సూపర్ సెంచరీ నమోదు చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈక్రమంలో టి20ల్లో రెండో సెంచరీ నమోదుచేసిన సూర్య పొట్టి ఫార్మాట్లో రెండు శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు.
టి20ల్లో ఓ బ్యాటర్ రెండు సెంచరీలు సాధించడం ఇదే ప్రథమం. ఇదే ఏడాది ఇంగ్లండ్పై 55బంతుల్లో 117పరుగులు చేసి సెంచరీ నమోదు చేసిన సూర్య, ఆదివారం కివీస్పై రెండో సెంచరీని నమోదు చేశాడు
కెప్టెన్ కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ (61 పరుగులు)సాధించినా జట్టుని జట్టుని గెలిపించలేక పోయాడు. ఆల్ రౌండర్ దీపక్ హుడా నాలుగు వికెట్లు తీశాడు. మహమ్మద్ సిరాజ్, యజువేంద్ర చాహల్ రెండేసి వికెట్లు తీశారు. భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్కు తలా ఒక వికెట్ దక్కింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. సూర్య కుమార్ యాదవ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 13 పరుగలకే ఔట్ అయ్యాడు. దీపక్ హుడా, వాషింగ్టన్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. సౌథీ హ్యాట్రిక్ సాధించాడు. సెంచరీతో జట్టుకి భారీ స్కోర్ అందించిన సూర్యకుమార్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది
.ఛతేశ్వర్ పూజారాకు అర్జున అవార్డు
భారత టెస్ట్ జట్టు ఆటగాడు ఛతేశ్వర్ పూజారా ఐదేళ్ల తర్వాత అర్జున అవార్డు అందుకున్నాడు. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్ చేతుల మీదుగా పూజారా ఈ అవార్డు అందుకున్నాడు. 2017లో పూజారాకు కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రకటించింది. అయితే, ఆ ఏడాది అతను అవార్డు వేడుకకు హాజరు కాలేదు.
ఐదేళ్ల తర్వాత అర్జున అవార్డు అందుకున్న పూజారా ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.’ఆలస్యం అయినా కూడా నాకు సన్మానం చేసి, అర్జున అవార్డు ప్రదానం చేసినందుకు బీసీసీఐ, అనురాగ్ ఠాకూర్కి ధన్యవాదాలు. తీరిక లేని క్రికెట్ షెడ్యూల్ కారణంగా ఆ ఏడాది అవార్డు అందుకోలేకపోయాను. అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది’ అంటూ పూజారా ట్వీట్ చేశాడు.
రాహుల్ ద్రావిడ్ తర్వాత భారత టెస్ట్ జట్టుకు మరో వాల్గా పూజారా పేరు తెచ్చుకున్నాడు. ఈమధ్యే కౌంటీ క్రికెట్లో అదరగొట్టిన పూజారా డిసెంబర్లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తున్న భారత టెస్ట్ జట్టుకు పూజారా ఎంపికయ్యాడు. టీమిండియా, బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ స్టార్ బ్యాటర్ ఇప్పటి వరకూ 96 టెస్ట్లు ఆడాడు