ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు నిందితులుగా ఉన్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జరుగుతున్న విచారణ గురించి తప్పుగా నివేదించిన రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే, జీ న్యూస్, టైమ్స్ నౌ చానల్స్కి ఢిల్లీ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ చానెల్లు ప్రసారం చేసే వార్తా నివేదికలను పరిశీలించి, ప్రసారాలు వాటి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని కోర్టుకు తెలియజేయాలని న్యూస్ బ్రాడ్కాస్టింగ్, డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీని కోర్టు ఆదేశించింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కొనసాగుతున్న దర్యాప్తుపై తాము అందించే అన్ని నివేదికలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన “అధికారిక సమాచారం” ఆధారంగా మాత్రమే ఉన్నాయని నిర్ధారించాలని కోర్టు వార్తా చానెల్లను ఆదేశించింది. సింగిల్ జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ జారీ చేసిన ఉత్తర్వు ప్రభావవంతంగా ఈ వార్తా చానెల్లు కేసుకు సంబంధించిన సోర్స్ ఆధారిత కథనాలను నివేదించలేవని కోర్ట్ అభిప్రాయపడింది.
చానెల్లు తమ ప్రసారాన్ని నియంత్రించే మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని కూడా కోర్టు ఆదేశించింది. తన కేసుకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఈడీ, సిబిఐ మీడియాకు లీక్ చేశాయని, తద్వారా నిందితుడిగా తన హక్కులకు భంగం కలిగిస్తున్నాయని ఆరోపిస్తూఆప్ కమ్యూనికేషన్స్ ఇన్చార్జి విజయ్ నాయర్ పిటిషన్పై కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
తన అభ్యర్ధనలో నాయర్ తనను ఏ ప్రశ్నలు అడిగారో, అతని సమాధానాలు ఏమిటో చానెల్లో ప్రసారమైన అనేక సందర్భాలను ప్రస్తావించారు. కోర్టులో ఎత్తి చూపి ఒక సందర్భంలో వార్తా ప్రసారంలో అతడిని మొదటి ప్రశ్న ఏమిటో కూడా ఉందని తెలిపారు.
గత వారం, ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీలో తమ దర్యాప్తునకు సంబంధించి మీడియాకు వారు జారీ చేసిన అన్ని బహిరంగ ప్రకటనలు, ప్రెస్ కమ్యూనికేషన్లను అందించాలని హైకోర్టు సీబీఐ, ఈడీని ఆదేశించింది. సోమవారం తాము ఎలాంటి పత్రికా ప్రకటన విడుదల చేయలేదని ఈడీ చెబుతుండగా, దర్యాప్తుకు సంబంధించి మూడు కమ్యూనికేషన్లు జారీ చేసినట్లు సీబీఐ తెలిపింది.
అయితే, నాయర్ తన పిటిషన్లో పేర్కొన్న ప్రసారాలు తాము అందించిన సమాచారం ఆధారంగా లేవని, రెండు ఏజెన్సీలు తెలిపాయి. సిబిఐ జారీ చేసిన సమాచారాలను చదివిన తర్వాత, వార్తా ప్రసారానికి, ఏజెన్సీలు అందించిన సమాచారానికి మధ్య ఎటువంటి సంబంధం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అందువల్ల, న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్బిడిఎ)ని కూడా కోర్టు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.