ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలనే కాదు సినీ , రాజకీయ ప్రముఖులను సైతం మోసం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటి , నిర్మాత జీవిత రాజశేఖర్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. జియో స్మార్ట్ స్టోర్లో ఆఫర్ల పేరుతో రూ. 1.22 లక్షలు కొల్లగొట్టారు. దీనిపై జీవిత రాజశేఖర్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
ఆమె ఫిర్యాదుతో నిందితుడు నాగేందర్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సైబర్ క్రైం ఏసీపీ ఏవీఎం ప్రసాద్ తెలిపారు. జియో బహుమతుల పేరుతో లక్షన్నర రూపాయల మేర జీవితారాజశేఖర్కు సైబర్ నేరగాళ్లు మోసం చేసారు. సగం ధరకే జియో బహుమతులు ఇస్తామంటూ ఛీటింగ్ చేశారని, అలా తెలిసినవారి పేరు చెప్పి జీవితారాజశేఖర్కు టోకరా వేశారు. తెలిసినవాళ్లని నమ్మి లక్షన్నర రూపాయలు బదిలీ చేసిన జీవిత మేనేజర్ ఆ డబ్బులు చెల్లించిన తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసు చెన్నైకి చెందిన నరేష్ని అరెస్టు చేసి అతన్ని విచారించారు. ఈ సమయంలో సైబర్క్రైమ్ పోలీసులు నరేష్ గతంలోనూ నటీనటులతోపాటు ప్రొడ్యూసర్స్ని మోసం చేసినట్టు గుర్తించారు.
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్రా లోకేష్
నటి పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. గత కొద్దీ రోజులుగా సీనియర్ హీరో నరేష్ – పవిత్రాల ఫై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెళ్లిళ్లు అయిన వీళ్లు సహజీవనం చేయడంపై కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.
రోజు రోజుకు వీరిపై ట్రోల్స్ ఎక్కువ అవుతుండటంతో పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తమ పట్ల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తమపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.