ఇది వరకు ఎన్నడు చూడని సౌర తుఫాను 2023లో మనం చూస్తామా? అదే జరిగితే ఆ సౌర తుఫాను సాంకేతికతను దెబ్బతీయగలదు. పెద్ద ఎత్తున బ్లాక్ అవుట్స్, కమ్యూనికేషన్స్ ఫెయిల్యూర్స్ ఏర్పడవచ్చు. అదే విధంగా, ఓ అణు కేంద్రం విస్ఫోటనం జరుగుతుందా? అనేక విధ్వంసకర ఘటనలు చోటుచేసుకుంటాయా?
ఇటువంటివి జరిగితే వచ్చే ఏడు ప్రళయకారకంగా ఉండే అవకాశం లేకపోలేదు. బల్గేరియాకు చెందిన ఓ గుడ్డి కార్మికురాలు బాబా వంగ చెప్పున ఇటువంటి జోస్యాలు నిజమవుతాయా? అనే చర్చ జరుగుతున్నది. ‘నోస్ట్రాడామస్ ఆఫ్ ది బాల్కన్స్’గా ఆమె ప్రసిద్ధి చెందారు. ఆమెకు తన 12వ ఏట చూపు పోయింది. ఆమెకు చూపులేకపోయినప్పటికీ దేవుడు ఆమెకు భవిష్యత్తులో జరుగబోయేది చూడగలిగే శక్తినిచ్చాడంటారు. ఆమె వాంజెలియా గుష్టెరోవ్గా జన్మించారు.
ఇప్పటి వరకు ఆమె చెప్పిన జ్యోష్యం 85 శాతం మేరకు నిజమయ్యాయి. 9/11 ఉగ్రదాడులు, బ్రెగ్జిట్, డయానా రాణి మరణం, బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడవుతాడు అని ఆమె చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఆమె 1996లో చనిపోయింది. ఈ ప్రపంచం 5079 వరకు కొనసాగుతుందందని ఆమె చెప్పారు. ఇప్పుడు 2023కు సంబంధించి ఆమె చెప్పిన జోస్యాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
2023లో భూ భ్రమణం కొంత మేరకు మారుతుందని తెలిపారు. వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. ఒకవేళ భూమి, సూర్యుడికి దగ్గరగా వెళితే రేడియేషన్ పెరుగుతుంది, ఉష్ణోగ్రత పెరుగుతుంది. మరోవైపు భూగ్రహం సూర్యుడికి దూరంగా వెళితే చీకటి గంటలు పెరుగుతాయి, మంచు యుగంలోకి మనం వెళతాం.
ఓ పెద్ద దేశం ప్రజలపై జీవాయుధాల పరిశోధన చేస్తుందని, దాని ఫలితంగా వేలాది మంది చనిపోతారని బాబా వంగ తెలిపింది. 2023లో ఓ అణు కేంద్రం విస్ఫోటనం కూడా జరుగుతుందని ఆమె జోస్యం చెప్పారు. సహజ జననాలను నిషేధిస్తారని, మానవులను ప్రయోగశాలలో తయారు చేస్తారని కూడా ఆమె తెలిపారు.
దీనర్థం ఎవరు పుట్టాలనేది కూడా ప్రపంచ నాయకులు, వైద్య నిపుణులు నిర్ణయిస్తారంట. తల్లిదండ్రులు కేవలం లక్షణాలు, రూపును అంటే- వెంట్రుకలు ఏ రంగులో ఉండాలి, కళ్లు ఏ రంగులో ఉండాలి అనేవి మాత్రం ఎంచుకునే అవకాశం కలిగివుంటారట.