ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తుపై కేసీఆర్ ప్రభుత్వం జారీచేసిన జిఓను కొట్టివేస్తూ, సిబిఐ దర్యాప్తుకు రాష్ట్ర హైకోర్టు అప్పగించడంతో సిబిఐ రంగంలోకి దిగింది. ఈ కేసుకు సంబంధించిన పత్రాలు హైకోర్టు నుండి అందిన వెంటనే గురువారమే కసరత్తు చేపట్టింది. ముందుగా, తెలంగాణ ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాసింది.
ఫామ్ హౌస్ కేసు సీబీఐకి బదిలీ చేసిన క్రమంలో ఎఫ్ ఐ ఆర్ నమోదుకు అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొందిమరోవంక, ఈ కేసుపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డిజిజన్ బెంచ్కు అప్పీల్కు వెళ్లింది. కేసు దర్యాప్తు సీరియస్గా జరుగుతోందని, ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కోణం ఉందని హైకోర్టుకు నివేదించింది.
అయిథెక్ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఇప్పుడే స్టే ఇవ్వలేమని హైకోర్టు డివిజన్ బెంచ్ తెలిపింది. అప్పీల్ పిటిషన్లు విచారణ దశలో ఉండగా స్టే అక్కర్లేదని స్పష్టం చేసింది.
ఈ కేసులో సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం, సిట్, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి వేర్వేరుగా వేసిన అప్పీల్ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ టి.తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. 4 గంటలకు పైగా వాదనలు జరిగాయి.
వాదనలు విన్న అనంతరం కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ దుష్యంత్ దవే కల్పించుకొని సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరారు. స్పందించిన కోర్టు అప్పీల్ పిటిషన్లపై విచారణ జరుగుతుండగా స్టే అవసరం లేదని చెప్పింది.