ఏపీలో అరాచక పాలన జరుగుతుందని, బ్రిటిష్ కాలం నాటి జీవో ఎపిలో తెచ్చారని, విపక్ష నేతలు ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నారని అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రవేశాలు వ్యక్తం చేశారు.
ఇటీవల కుప్పం పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడుకు అడుగడుగునా పోలీసులు అడ్డంకులు కల్పించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో చంద్రబాబు ఇంటికి వెళ్లి, సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఇరువురు నేతలు రెండు గంటలసేపు జరిపిన భేటీలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘కుప్పంలో జరిగిన సంఘటనపై చంద్రబాబును కలిశాను. ఏపీలో అరాచక పాలన కొనసాగుతుంది. వైసీపీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష నేతలకు ఉన్న హక్కులను వైసీపీ కాలరాస్తోంది’ అని విమర్శించారు.
“పెన్షన్లు తీసేయడం, రైతు సమస్యలపై చర్చించాం. వైసీపీకి బాధ్యతలు గుర్తు చేయాలి. బ్రిటీష్ కాలంనాటి జీవో తెచ్చారు. వీటికి బ్రేక్ పడాలి. వైజాగ్లో నన్ను కూడా అడ్డుకున్నారు. జీవో నంబర్-1కు ముందు పరిణామాలను ముందుగా వైజాగ్లోనే చూశాం. ఫ్లెక్సీలు వాడొద్దంటారు.. ఆయనకి మాత్రం ఫ్లెక్సీలు పెట్టుకుంటారు” అని విమర్శించారు.
రూల్స్ అందరికీ వర్తిస్తాయంటారని, కానీ అమలు లేదని అంటూ లాఠీలు కూడా మేమే పట్టుకోవాలా? వాళ్లే దాడులు చేసుకొని.. వాళ్ల మంత్రుల ఇళ్లు తగలబెట్టుకునే సంస్కతి వైసీపీదని మండిపడ్డారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. ”ఏపీలో వ్యవస్థలన్నీ నాశనమైపోయాయి. వ్యవస్థలను నాశనం చేయడమే వైసీపీ అజెండా.. ఏపీలో జీవో నం.1 ద్వారా ఉన్మాదుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు.. కుప్పం వెళ్తే గొడవలు సష్టించి తనను అడ్డుకునే ప్రయత్నం చేశారు” అంటూ విమర్శించారు.
వైసీపీ కుట్రలో భాగమే కందుకూరు, గుంటూరు ఘటనలు. కందుకూరు ఘటనలని ఆరోపించారు. పోలీసుల కుట్ర కాదని చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. శాంతి భద్రతలు కాపాడే బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. కుట్ర, కుతంత్ర రాజకీయాలను తిప్పికొడతామని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పట్టాలెక్కిస్తామని భరోసా వ్యక్తం చేశారు.
అమరావతి రైతులకు సంఘీభావం కోసం వెళ్తే రాళ్లు, కర్రలతో దాడులు చేశారని గుర్తు చేశారు. ఇప్పటంలో సమావేశానికి ప్రజలే స్థలం ఇచ్చారని, కానీ స్థలం ఇచ్చిన ప్రజల ఇళ్లు కూల్చే చర్యలు చేపట్టారని ధ్వజమెత్తారు. విశాఖ వెళ్లిన పవన్ను బయటకు రాకుండా ఆంక్షలు పెట్టారని అంటూ తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పవన్కు కతజ్ఞతలు తెలిపారు.