ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని చెబుతూ ఇందులో భాగంగా ప్రతి ఏటా 10 లక్షల ఉద్యోగాల భర్తీని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రతి నెలా లక్ష ఉద్యోగాల భర్తీ కోసం మూడో వారంలో ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే రెండు దఫాలుగా ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పిన ఆయన చెప్పిన ఆయన.. ఈ నెల 20న మరికొందరికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తామని అన్నారు.
ప్రజారోగ్యానికి కేంద్రం పెద్దపీట వేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా లక్షా 50వేల వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వెల్ నెస్ సెంటర్లలో అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
గతంలో దేశవ్యాప్తంగా 387 మెడికల్ కాలేజీలు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 606కు పెరిగిందని, 7 ఎయిమ్స్ హాస్పిటళ్ల స్థానంలో ఇప్పుడు 22కు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. 2024లో మరో 9 ఎయిమ్స్ ఆస్పత్రులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.
కాగా, మంత్రి కేటీఆర్ తండ్రి కేసీఆర్ కంటే దిగజారి మాట్లాడుతున్నారని చెబుతూ తాను కేటీఆర్లా తండ్రిని అడ్డుపెట్టుకుని తాను మంత్రిని కాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో కిందిస్థాయి నుంచి కష్టపడి ఎదిగానని చెప్పారు. కేటీఆర్ కాదు.. రాజీనమా లేఖతో కేసీఆర్ సిద్ధంగా ఉంటే కేంద్ర నిధులపై చర్చకు రెడీ అని సవాల్ చేశారు.
మంత్రి కేటీఆర్ చదువుకున్న అజ్ఞాని అని విమర్శించారు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్న కేటీఆర్కు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. వందే భారత్ రైలు తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకని కిషన్రెడ్డి చెబుతూ ఆదివారం ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభిస్తారని తెలిపారు. కేసీఆర్కు కేంద్రం ఆహ్వానం పంపిందని, కార్యక్రమానికి హాజరవడం కేసీఆర్ విజ్ఞత చెప్పారు.