అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. మైనే రాష్ట్రంలోని లెవిస్టన్లో దుండగులు జరిపిన మాస్ షూటింగ్లో 22 మంది మరణించారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వారికోసం గాలిస్తున్నామని చెప్పారు. పోర్ట్లాండ్లో అతి పెద్ద నగరం లెవిస్టన్, రెండో నగరం మైన్ అని అధికారులు వెల్లడించారు.
కాగా కాల్పులు జరిపినట్లు భావిస్తున్న అనుమానితుడి ఫొటోను పోలీసులు సోషల్ మీడియాలో విడుదల చేశారు. అందులో అతడు సెమీ ఆటోమేటిక్ రైఫిల్తో కన్పించాడు. గతంలో యూఎస్ ఆర్మీలో పనిచేసిన ఓ రిజర్వ్ సభ్యుడిగా అతడిని అనుమానిస్తున్నారు.
నిందితుడిని రాబర్ట్ కార్డ్గా గుర్తించారు.
ఇతడు మైనేలోని యూఎస్ ఆర్మీ రిజర్వ్ ట్రైనింగ్ సెంటర్లో ఫైర్ఆర్మ్స్ ఇన్స్ట్రక్టర్గా పనిచేసి రిటైర్ అయినట్లు పోలీసులు తెలిపారు. 40 ఏళ్ల రాబర్ట్.. గతంలో గృహహింస కేసులో అరెస్టయి విడుదలయ్యాడని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆరంభంలో అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో మైనే ప్రాంతంలోని ఓ మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈఘటనపై ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తాత్కాలికంగా స్థానిక వ్యాపార సంస్థలను మూసివేయాలని.. స్థానికులు తాత్కాలికంగా ఇళ్లలోనే ఉండాలని, ఇళ్ల తలుపులు మూసి ఉంచుకోవాలని సూచించారు.