తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బిజెపి ప్రకటించింది. లిస్టులో 40 మందికి చోటు కల్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీకి స్థానం కల్పించింది.
అలాగే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప, యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పురుషోత్తం రూపాల, అర్జున్ ముండా, భూపేంద్ర యాదవ్, సాధ్వి నిరంజన్ జ్యోతి, మురుగన్, పార్టీ నాయకులూ ప్రకాశ్ జవదేకర్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అర్వింద్ మీనన్, రవికిషన్, ఏపీకి చెందిన నేత పురంధేరశ్వరిని నియమించింది.
అదే విధంగా తెలంగాణకు చెందిన 19 మంది నేతలకు పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు లభించింది. అందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డా. కె. లక్ష్మణ్, బండి సంజయ్, డికె. అరుణ, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్కుమార్, సోయం బాపూరావు, రాజాసింగ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు.
వీరితో పాటు బూర నర్సయ్య గౌడ్, ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, కృష్ణ ప్రసాద్ లకు కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాల్లో అవకాశం కల్పించింది. వీరితో పాటు మాజీ ఎంపీ విజయశాంతి, ఎమ్యెల్యే ఎం రఘునందన్ రావు లను కూడా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి చేర్చారు.