సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలతో సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా విరాట్ నిలిచాడు.
న్యూజిలాండ్ పై సెంచరీ తో వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు కోహ్లీ. 49 సెంచరీలు చేసిన సచిన్ రికార్డ్ని కోహ్లీ బ్రేక్ చేశాడు. ఈ వరల్డ్ కప్ టోర్నీ లో తన పుట్టిన రోజు నాడే సౌతాఫ్రికాపై సెంచరీ చేస సచిన్ రికార్డ్ ని సమం చేసిన కోహ్లీ ఈ మ్యాచ్లో ఆ రికార్డును బ్రేక్ చేశాడు.
వాంఖడే వేదికగా విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో సచిన్ను అధిగమించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో రోహిత్ 31 సెంచరీలు చేశాడు.
ఈ మ్యాచ్లో కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్కప్ సింగిల్ ఎడిషన్లో అత్యధిక ఫిప్టి ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా విరాట్ చరిత్రకెక్కాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా న్యూజిలాండ్తో సెమీఫైనల్లో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్ ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ ఏడాది మెగా టోర్నీలో కోహ్లి ఇప్పటివరకు 8 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. వన్డే వరల్డ్కప్-2003లో సచిన్ 7 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు. తాజా మ్యాచ్తో సచిన్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
అంతేకాకుండా వన్డే వరల్డ్కప్ ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డును కూడా కోహ్లి బ్రేక్ చేశాడు. విరాట్ ఈ టోర్నీలో ఇప్పటివరకు 674లి పరుగులు చేశాడు. అంతకుముందు 2003 వరల్డ్కప్లో సచిన్ 673 పరుగులు సాధించాడు.
అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా కింగ్ కోహ్లీ నిలిచాడు. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ (13,704) పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. కోహ్లి ఇప్పటివరకు వన్డేల్లో 13,751 పరుగులు చేశాడు. వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి రికార్డుల మోత మోగిస్తున్నాడు.