దేశ భవిష్యత్తును ప్రగతి పదంలోకి తెచ్చేది బీజేపీ యేనని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరి స్పష్టం చేశారు. కాంగ్రెస్.. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు తప్ప ప్రజా సంక్షేమం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. అమెరికాకు దీటుగా తెలంగాణలో రోడ్లు తీర్చిదిద్దుతామని తెలిపారు. రవాణా సౌకర్యాలు మెరుగు పడినప్పుడే వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ది చెందుతా యని పేర్కొన్నారు.
గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాత కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహించిన విజయ సంకల్పయాత్ర ముగింపు సభ కార్య క్రమంలో ముఖ్య అతిదిగా పాల్గొంటూ, కాంగ్రెస్ పాలనలో అనేక గ్రామాలు అద్వాన్నంగా తయారయ్యాయని, రోడ్లు, తాగు నీరు సౌకర్యాలు లేక ప్రజలు పట్టణాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారురు. సర్కారు ఆసుపత్రులలో సౌకర్యాలు లేక అందుబాటు లో అనేక గ్రామాలు ఖాళీ అయ్యాయని వాపోయారు.
కాంగ్రెస్ హయాంలో రైతుల పరిస్థితి బాగా లేదని, 25 శాతం నుంచి 30 శాతం వరకు ప్రజలు పల్లెలను విడిచి పట్ట ణాలకు వలస వెళ్లారని తెలిపారు కాంగ్రెస్ హయాంలో గ్రామాల అభివృద్ధికి కృషి చేయలేదని ఆరోపించారు. గతంలో ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్ హాయంలో రోడ్ల నిర్మాణాల కోసం ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని అందుబాటులోకి తెచ్చామనీ గుర్తు చేశారు.
విమానాలకు ఇంధనం అందించే సత్తా మన రైతుల్లో ఉందని పేర్కొంటూ రైతులకు ఆర్థిక చేయూతనిచ్చి వారిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైతుల ఆత్మ హత్యలు ఆపేందుకు రైతు సంక్షే మం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణలో సాగవుతున్న పసుపు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోందని తెలిపారు. తెలంగాణలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
15 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషితో పసువు క్వింటాలుకు రూ. 15 వేలకు వచ్చిందని, పసుపు రైతులకు మంచిరోజులు వచ్చాయని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. ఈ జిల్లా పసుపు పంట చాలా ప్రత్యేకమని 15 ఏళ్ల తర్వాత పసువు క్వింటాకు రూ. 15 వేల ధర వచ్చిందని పేర్కొంటూ గతంలో రూ.6 వేలు మాత్రమే పలికేదని చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అయితే, కాంగ్రెస్ పార్టీ నిజాo షుగర్ ఫ్యాక్టరీని రాజకీయంగా వాడుకుంటోందని విమర్శించారు.
