టీ 20 వరల్డ్ కప్లో వరుస హాఫ్ సెంచరీలతో విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. బంగ్లాదేశ్ మ్యాచ్లోనూ 64 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన ఆట తీరుతో అక్టోబర్ నెలకు అతను ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మన్త్ అవార్డ్కి నామినేట్ అయ్యాడు.
అక్టోబర్ నెలలో టీ 20 మ్యాచ్ల్లో కోహ్లీ 200 సగటు, 150. 73 స్ట్రైక్ రేటుతో 205 పరుగులు చేశాడు. ఈ అవార్డుకి కోహ్లీ నామినేట్ కావడం ఇదే మొదటి సారి. ఇతనితో పాటు దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్, జింబాబ్వే ఆటగాడు సికిందర్ నామినేట్ అయ్యారు.
అన్ని క్రికెట్ ఫార్మట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను గుర్తించి, వాళ్లను గౌరవించడం కోసం ఐసీసీ 2021 జనవరిలో ప్లేయర్ ఆఫ్ ది మన్త్ అవార్డుని మొదలు పెట్టింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మన్త్ అవార్డుని ఇప్పటివరకు నలుగురు భారత ఆటగాళ్లు ఈ అవార్డు గెలిచారు.
అక్టోబర్ నెలకు ఐసీసీ విమెన్స్ ప్లే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మన్త్ అవార్డు కోసం భారత మహిళల క్రికెట్ టీం నుంచి బ్యాటర్ జెమీమీ రోడ్రిజ్, దీప్తి శర్మ, పాకిస్తాన్ జట్టు నుంచి దార్ నామినేట్ అయ్యారు.
ఇలా ఉండగా, ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఆట తీరుతో ఎన్నో రికార్డులను నెలకొల్పిన కోహ్లీ బుధవారం బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్ లో తన వ్యక్తిగత స్కోర్ 16 వద్ద ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.
అంతకుముందు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ శ్రీలంక క్రికెటర్ మహేళ జయవర్దనే (1016) పేరిట ఉండేది. ప్రస్తుతం ఆ రికార్డ్ ను కోహ్లీ అధిగమించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 64 పరుగులతో నాటౌట్గా నిలిచి, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అయ్యాడు.
