నకిలీ కుల ధ్రువీకరణ పత్రం కేసులో లోక్సభ ఎంపీ నవనీత్ రాణా, ఆయన తండ్రిపై ముంబై కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అంతకుముందు కూడా నవనీత్ రాణా, ఆమె తండ్రికి వ్యతిరేకంగా కోర్టు సెప్టెంబర్లో కూడా వారెంట్ జారీ చేసింది.నాడు కోర్టు జారీ చేసిన పాత వారెంట్ కూడా ఇంకా అమలు కాలేదు.
ఈ వ్యవహారం సోమవారం విచారణకు రాగా అమరావతి ఎంపీ అయిన నవనీత్ రాణా, ఆమె తండ్రిపై వారెంట్ అమలుకు మరింత గడువు కావాలని పోలీసులు కోరారు.అయితే పోలీసుల అభ్యర్థనను తోసిపుచ్చిన ముంబయి కోర్టు.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఈ మేరకు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నవనీత్ రాణాతో పాటు ఆయన తండ్రిపై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఆ తర్వాత సర్వీస్ ఆఫ్ వారెంట్పై నివేదికను సమర్పించేందుకు కేసు విచారణను ఈ నెల 28కి వాయిదా చేశారు.
.ముంబైలోని ములుంద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు ప్రకారం ఎంపీ నవనీత్ రాణా, ఆమె తండ్రి తప్పుడు కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించారని ఫిర్యాదు దారుడు ఆరోపించారు. అమరావతి ఎంపీకి జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాన్ని మోసపూరితంగా పొందారని బాంబే హైకోర్టు 2021వ సంవత్సరంలో రద్దు చేసింది.
దానితో, షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ అయిన అమరావతి ఎంపీ స్థానంలో నకిలీ కులధ్రువీకరణ పత్రంతో పోటీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.