“ప్రభుత్వం ఊహించిన ఆర్థిక (ఫిస్కల్ గ్లైడ్) మార్గానికి అనుగుణంగా, జి డి పి లో %గా కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు క్రమంగా క్షీణించడం, గత రెండు సంవత్సరాలలో ఉత్సాహభరితమైన ఆదాయ సేకరణ ద్వారా జాగ్రత్తగా ఆర్థిక నిర్వహణకు మద్దతు ఇచ్చిన ఫలితం‘‘ అని 2022-23 ఆర్థిక సర్వే తెలిపింది.
2023 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 6.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ప్రపంచ అనిశ్చితుల సమయంలో కన్జర్వేటివ్ బడ్జెట్ అంచనాలు బఫర్ ను అందించాయని సర్వే పేర్కొంది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, ఆదాయాలు పుంజుకోవడంతో ఆర్థిక పనితీరు పుంజుకుంది.
2022 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు స్థూల పన్ను ఆదాయం15.5 శాతం (ఇయర్ ఆన్ ఇయర్ – వై ఒ వి )వృద్ధిని నమోదు చేసిందని, రాష్ట్రాలకు కేటాయించిన తర్వాత కేంద్రానికి నికర పన్ను ఆదాయం 7.9 శాతం పెరిగిందని సర్వే తెలిపింది. జిఎస్ టిని ప్రవేశపెట్టడం ఆర్థిక లావాదేవీల డిజిటలైజేషన్ వంటి నిర్మాణాత్మక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను మరింత క్రమబద్ధీకరించడానికి దారితీశాయి, తద్వారా పన్ను వలయాన్ని విస్తరించాయి. మరియు పన్ను చెల్లింపును పెంచాయి. తద్వారా జీడీపీలో వృద్ధి కంటే రాబడులు చాలా ఎక్కువ వేగంతో పెరిగాయి.
2022 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపు పన్ను వృద్ధి కారణంగా ప్రత్యక్ష పన్నులు వార్షిక ప్రాతిపదికన 26% పెరిగాయని ఆర్థిక సర్వే తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో ప్రధాన ప్రత్యక్ష పన్నులలో గమనించిన వృద్ధి రేట్లు వాటి సంబంధిత దీర్ఘకాలిక సగటుల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని సర్వే పేర్కొంది.
అధిక దిగుమతులు 2022 ఏప్రిల్ నుండి నవంబర్ వరకు కస్టమ్స్ వసూళ్లలో 12.4% వృద్ధికి దారితీశాయని సర్వే తెలిపింది. 2022 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎక్సైజ్ డ్యూటీ వసూళ్లు 20.9 శాతం తగ్గాయి.
భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు
జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2022లో 70 లక్షల నుంచి 1.4 కోట్లకు రెట్టింపు అయింది. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.13.40 లక్షల కోట్లుగా ఉన్నాయి. తద్వారా నెలకు సగటున రూ.1.5 లక్షల కోట్ల వసూళ్లతో 24.8 శాతం వృద్ధి నమోదైందని సర్వే పేర్కొంది. జిఎస్ టి ఎగవేతదారులు, నకిలీ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన డ్రైవ్, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ను సరిదిద్దే రేటు హేతుబద్ధీకరణ వంటి వ్యవస్థాగత మార్పుల కారణంగా జిఎస్ టి వసూళ్లు మెరుగుపడినట్లు తెలిపింది.
మహమ్మారి ప్రేరిత అనిశ్చితి, భౌగోళిక రాజకీయ సంఘర్షణ, సంబంధిత ప్రమాదాలు గత మూడేళ్లలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల ప్రణాళికలు, అవకాశాలకు సవాళ్లు గా మారినందున 2023 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లో కేటాయించిన రూ.65,000 కోట్లలో 48 శాతం మాత్రమే 2023 జనవరి 18 నాటికి సేకరించామని,ఆర్థిక సర్వే పేర్కొంది.
2022 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో దీర్ఘకాలిక సగటు 2.5 శాతంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం క్రమంగా పెరిగిందని సర్వే తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇది జిడిపిలో 2.9% కు పెరుగుతుందని అంచనా వేశారు. ఇది సంవత్సరాలుగా ప్రభుత్వ వ్యయం నాణ్యతలో మెరుగుదలను సూచిస్తుంది. కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ వ్యయాన్ని 2021 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 15.6 శాతం నుంచి 2022 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 13.5 శాతానికి తగ్గించారు.