ఢిల్లీ-ముంబాయి ఎక్స్ప్రెస్వే దేశాభివృద్ధిలో బలమైన స్తంభంగా నిలవనుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోను ఈ ఎక్స్ప్రెస్వేలో భాగంగా ఢిల్లీ-దౌసా-లాల్సోట్ల మధ్య పూర్తయిన తొలిదశ రహదారిని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. రాజస్థాన్లోని దౌసాలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
దీంతోపాటు రూ.18,100 కోట్లతో చేపట్టనున్న నాలుగు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు పాల్గనాురు. తొలిదశలో మొత్తం 247 కిలోమీటర్ల మేర ఈ రహదారిని ఎనిమిది లేన్లుగా రూ.10,400 కోట్ల వ్యయంతో నిర్మించారు.
దీనివల్ల ఇక మీదట మూడున్నర గంట్లలోనే ఢిల్లీ నుంచి జైపూర్కు చేరుకోవచ్చు. ప్రస్తుతం 5 గంటల సమయం పడుతోంది. 2019 మార్చి 9న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఢిల్లీతోపాటు మధ్యలో అయిదు రాష్ట్రాలను (హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర) కలుపుతూ 1386 కిలోమీటర్ల మేర ఈ రహదారి వెళుతోంది.
జైపూర్, అజ్మేర్, కోటా, ఉదరుపుర్, చిత్తోర్గఢ్, భోపాల్, ఇందౌర్, ఉజ్జయిని, అహ్మదాబాద్, సూరత్, వడోదరా వంటి ప్రధాన పట్టణాలను కలుపుతుంది. ఈ రహదారి పూర్తిగా సిద్ధమైతే ఢిల్లీ, ముంబాయి మధ్య ప్రస్తుతం ఉన్న దూరం 180 కిలోమీటర్ల మేర తగ్గుతుంది. ప్రయాణ సమయం సైతం 24 గంటల నుంచి ఏకంగా 12 గంటలకు తగ్గిపోతుంది.
ఈ రహదారి నిర్మాణం కోసం 5 రాష్ట్రాల్లోని 15 వేల హెక్టార్ల భూమిని సమీకరించారు. సుమారు రూ.లక్ష కోట్లతో పనులు చేపడుతున్నారు. ఈ ఏడాది చివరికల్లా ఈ ఎక్స్ప్రెస్వే పూర్తిగా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
మౌలిక వసతులు, కీలక వ్యవస్థల పటిష్టత దిశలో పెట్టుబడులతో మరిన్ని పెట్టుబడులు వస్తాయని, ఇది వ్యాపారాభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు. ప్రగతి దిశలో ఇది మరో రాదారి, ఇందులో అంతర్భాగాన్ని ఇప్పుడు జాతికి అంకితం చేస్తున్నామని తెలిపారు.
ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేలో భాగంగా ఇప్పుడు రూపుదిద్దుకున్న ఢిల్లీ దౌసా లాల్సోట్ మార్గంతో దేశ రాజధాని ఢిల్లీకి రాజస్థాన్రాజధాని జైపూర్కు ప్రయాణ కాలం గణనీయంగా తగ్గుతుంది. ఇది కీలక పరిణామం అని ప్రధాని తెలిపారు. ఏ పెట్టుబడి అయినా మరిన్ని పెట్టుబడుల వైపు దారులు తీరడమే తమ ప్రభుత్వ ప్రాజెక్టుల లక్ష్యం అని ప్రధాని స్పష్టం చేశారు.