శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నేత సంజయ్ రౌత్ పై పరువునష్టం కేసు నమోదైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే నుండి తనకు ప్రాణహాని ఉందని తప్పుడు ఆరోపణలు చేసినట్లు థానే మాజీ మేయర్ మీనాక్షి షిండే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో సంజయ్ రౌత్పై ఐపిసి సెక్షన్ కింద పరువు నష్టం శతృత్వాన్ని ప్రోత్సహించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, దుష్ప్రవర్తనతో కూడిన ప్రకటనలు వంటి సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
లోక్సభ ఎంపిగా ఉన్న శ్రీకాంత్ షిండే తనను హత్య చేసేందుకు థానేకు చెందిన రాజా ఠాకూర్కు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఈ వారం ప్రారంభంలో సంజయ్ రౌత్ థానే పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తూ ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు కాపీని పోలీసులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీక్కు పంపారు.
ఈ ఫిర్యాదుపై ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ రౌత్ ప్రజల నుండి సానుభూతి పొందేందుకు యత్నిస్తున్నారని, అందుకే ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫడ్నవీస్ పేర్కొన్నారు.