సహజీవన సంబంధాలను (లివ్ ఇన్ రిలేషన్షిప్) రిజిస్టర్ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇది తెలివి తక్కువ ఆలోచన అని ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ మండిపడ్డారు.
దేశంలో సహజీవన సంబంధాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, అందుకోసం మార్గదర్శకాలు సూచించాలంటూ ఓ పిటిషనర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అలాగే సహజీవనంలో ఉన్న వారికి సామాజిక భద్రత కూడా కల్పించాలని ఆ పిల్లో కోరారు. ఈ పిల్పై సిజెఐ డివై. చంద్రచూడ్తో కూడిన ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
సహజీవన సంబంధాలను కేంద్ర ప్రభుత్వం ఎలా రిజిస్టర్ చేస్తుందని, వాటితో కేంద్రానికి సంబంధం ఏమిటని ప్రశ్నించింది. ఇలాంటి తెలివి తక్కువ ఆలోచనలతో పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృధా చేసినవారికి జరిమానా విధించాల్సి వుంటుందని స్పష్టం చేసింది.
ఈ పిటిషన్ ద్వారా సహజీవనంలో ఉన్న వారికి భద్రత కల్పించాలని చూస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిల్ను కొట్టివేసింది.ఇటీవల సహజీవనంలో ఉన్న శ్రద్ధా వాకర్ను ఆమె భాగస్వామి అఫ్తాబ్ పూనావాలా అతి క్రూరంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. దీంతో సహజీవన సంబంధాలకు మార్గదర్శకాలు సూచించాలంటూ పిల్ దాఖలైంది.