“కేసీఆర్ అవినీతి-నియంత-కుటుంబ పాలనను ఎండగడదాం. కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే నినాదాన్ని పల్లెపల్లెకు తీసుకెళదాం. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణలో డబుల్ అభివ్రుద్ధి సాధ్యమనే విషయాన్ని గడప గడపకూ తీసుకెళదాం” అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు.
హైదరాబాద్ లో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ –కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీల చీకటి ఒప్పందాలను బయటపెడతాం. ఆ దుష్ట చతుష్టయ పార్టీలను బజారుకీడుద్దామని స్పష్టం చేశారు.
రైతులు, నిరుద్యోగులు, విద్యార్తులు, ఎస్సీ,ఎస్టీ, బీసీలుసహా తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలు బాధల్లో ఉన్నారని, కేసీఆర్ పాలన విరగడ కావాలని కోరుకుంటున్నరని సంజయ్ తెలిపారు. వాళ్లంతా ఆశగా బీజేపీవైపు ఎదురు చూస్తున్నరని చెబుతూ బీజేపీ సింహంలా సింగిల్ గానే కొట్లాడుతుందని, అధికారంలోకి వస్తుందని, బీజేపీ ఆధ్వర్యలో పేదల రాజ్యాన్ని స్థాపించడం ఖాయమని భరోసా వ్యక్తం చేశారు.
కర్నాటక ఎన్నికల ఫలితాలు రాంగనే తెలంగాణలో బీజేపీ పనైపోయిందని ప్రచారం చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. మీడియాలోని ఓ సెక్షన్ వీరికి వంతపాడుతూ బీజేపీలో చేరిన లీడర్లంతా కాంగ్రెస్ లోకి పోతున్నరని కథనాలు మొదలు పెట్టినయని ధ్వజమెత్తారు. కర్నాటక ఫలితాలకు, తెలంగాణకు సంబంధమేంది? అని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలను గ్రామగ్రామాన, గడప గడపకూ చేర్చాలనే ఉద్దేశంతోనే ఈనెల 30 నుండి జూన్ 30 వరకు మహా జన సంపర్క్ అభియాన్ పేరుతో కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు.
దేశంతోపాటు తెలంగాణ అభివ్రుద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో క్రుషి చేస్తున్నా కేసీఆర్ ప్రభుత్వ మూర్ఖత్వంతో అనుకున్న స్థాయిలో అభివ్రుద్ధి జరగడం లేదని సంజయ్ విచారం వ్యక్తం చేశారు. కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను, ఇస్తున్న నిధులను ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపిచ్చారు.