యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించారు.
నవంబర్ 30న తెలంగాణ, నవంబర్ 23న రాజస్థాన్, నవంబర్ 17న మధ్యప్రదేశ్, నవంబర్ 7, 17 తేదీలలో ఛత్తీస్గఢ్ లో రెండు విడతలలో జరగనుండగా, నవంబర్ 17 న మిజోరాంలో ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరుగుతుందని ప్రకటించారు. ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ నవంబర్ 3న రానుందని వెల్లడించారు. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10, 2023 అని వెల్లడించారు. పరిశీలన 13 నవంబర్, 2023 అని వివరించారు.
ఇక ఉపసంహరణ చివరి తేదీ 15 నవంబర్, 2023 (బుధవారం) అని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ 3 డిసెంబర్, 2023న (ఆదివారం) జరుగుతుందన్నారు. ఇక రాజస్థాన్కి నవంబర్ 23న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యప్రదేశ్లో నవంబర్ 7న పోలింగ్ జరగనుందని వెల్లడించారు.
మిజోరంలో నవంబర్ 7న ఓటింగ్ జరగనుంది. ఇక చత్తీష్గఢ్లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో నవంబర్ 7న, రెండవ దశలో నవంబర్ 17న జరగనున్నాయి. ఇక అన్ని రాష్ట్రాలకూ డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాజకీయ పార్టీలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు సహా భాగస్వాములు అందరితోనూ సంప్రదింపులు జరిపామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల్లో పారదర్శకత, పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణ కోసం అదనంగా 1.01 లక్షల బూత్లకు వెబ్క్యాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు తెలిపారు.
తెలంగాణ(119), మధ్యప్రదేశ్(230), ఛత్తీస్గఢ్(90), రాజస్థాన్(200), మిజోరాం(40) రాష్ట్రాలలో మొత్తం 679 అసెంబ్లీ సీట్లు ఉండగా, మొత్తం 16.14 కోట్లమంది ఓటర్లు ఉన్నారని తెలిపింది.. కొత్తగా 60 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. మహిళల ఓటర్ల సంఖ్య పెరిగిందని పేర్కొంది.