ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్ జిల్లాలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఏడుగురు నక్సలైట్లు మరణించగా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. గోబెల్ గ్రామ సమీపంలోని ఒర్చా అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
నారాయణ్పూర్, కొడగావ్, దంతెవాడ, బస్తర్ జిల్లాలకు చెందిన నొలీపెల .ఇలంలా కి.కంవః గాకెండచ ఇండొ టిబెటన్ బార్డర్ పోలీసుకు చెందిన 45వ బెటాలియన్తో కూడిన ఉమ్మడి భద్రతా దళం నక్సల్స్ కోసం కూంబింగ్ జరిగినపుడు ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు.
కాల్పుల పోరు ఆగిపోయిన అనంతరం పోలీసులు వెళ్లి చూడగా యూనిఫారాలలో ఉన్న ఐదుగురు నక్సలైట్ల మృతదేహాలు కనిపించాయని వారు చెప్పారు. వారి నుంచి కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను కలుపుకుంటే ఈ ఏడాదిలో ఇప్పటివరకు రాష్ట్రంలో భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో మరణించిన నక్సల్స్ సంఖ్య 122కి చేరుకుంది.
మే 23న నారాయణపూర్-బీజాపూర్ అంతర్ జిల్లా సరిహద్దులోని అడవిలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సలైట్లు మరణించగా, మే 10న బీజాపూర్ జిల్లాలో 12 మంది హతమయ్యారు. కాగా, ఏప్రిల్ 30న నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని అడవిలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మహిళలతో సహా 10 మంది నక్సలైట్లు మరణించగా, ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో 29 మంది మరణించారు.