లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలకు కారణాలు తెలుసుకునేందుకు వచ్చి న కురియన్ కమిటీ పర్యటన అర్ధంతరంగా ముగిసింది. మూడు రోజుల పర్యటనను రెండు రోజులకే కుదించుకొని శుక్రవారం తిరిగి వెళ్ళిపోయింది. కమిటీకి నేతృత్వం వహించిన పీజే కురియన్ శుక్రవారం ఉదయం కేరళకు వెళ్లిపోగా, మిగతా ఇద్దరు సభ్యులు సాయంత్రం 4 గంటల వరకు పార్లమెంట్ ని యోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, డీసీసీ అ ధ్యక్షుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
కమిటీ ముందు హాజరైన ఓడిపోయిన ఎం పీ అభ్యర్థులు, గెలిచిన ఎంపీలు ఒకేలా రాసిచ్చిన స్క్రిప్ట్ మాదిరిగా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి మళ్లడం వల్లనే ఓడిపోయామని చెప్ప డం పట్ల కురియన్ పెదవి విరిచింది. ‘ఇలా అయితే వాస్తవాలెలా బయటికి వస్తాయి? మమ్మల్ని కలువడానికి ముందు మీరంతా ఒకే విధంగా చెప్పాలని నిర్ణయించుకున్నారా?’ అని ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
రెండో రోజు కూడా అవే కారణాలనే చెప్పినట్టు తెలిసింది. దీంతో ఇక ఫలితం లేదని భావించిన మిగతా ఇద్దరు సభ్యులు కూడా శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయారు. తమ నివేదికను ఈ నెల 21న అధిష్ఠానానికి అందించనున్నట్టు కురియన్ కమిటీ సభ్యుడు రికాబుల్ హసన్ మీడియాకు తెలిపారు.
అధికారంలో ఉండి కూడా మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోకపోవడానికి అభ్యర్థుల ఎంపిక సరిగ్గా జరగలేదని, ఇతర పార్టీలకు చెందిన నేతలను ఎన్నికలకు ముందే పార్టీలో చేర్చుకొని బరిలోకి దించారని, నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచే విధంగా బలహీనమైన అభ్యర్థులను ఎంపిక చేశారని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డిపై రాష్ట్ర నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు.
ఇందులో నిజానిజాలను తేల్చేందుకే ఏఐసీసీ కురియన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి రాష్ర్టానికి పంపింది. కానీ కమిటీ ముందు హాజరైన వారంతాపై కారణాల్లో ఒక్కటీ చెప్పలేదు. దీంతో వారు రాష్ట్ర నాయకత్వానికి భయపడ్డారా? లేక తమ నాయకుడిని కాపాడుకున్నారా? అన్న సందేహా లు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని చేవెళ్ల, మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలువకపోవడానికి మంత్రివర్గంలో ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడమే కారణమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కమిటీకి వివరించినట్టు మీడియాకు తెలిపారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఇక్కడ ఎంపీ సీట్లు గెలువలేకపోయామని ఆయన వివరించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎంతో కాం గ్రెస్ పార్టీ లోపాయకారి పొత్తు పెట్టుకోవడంతో హిందూ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుచూపారని నాంపల్లి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయి న ఫిరోజ్ఖాన్ భిన్నమైన వాదన వినిపించినట్టు తెలిసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్, మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్ సీట్లలో కాం గ్రెస్ అభ్యర్థుల ఓటమికి ఇదే కారణమని ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సూచన మేరకు హైదరాబాద్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని బరిలోకి దించిందని, తనకు అక్కడి నుంచి టికెట్ ఇచ్చి ఉంటే కచ్చితంగా గెలిచేవాడినని కూడా ఫిరోజ్ఖాన్ చెప్పినట్టు తెలిసింది.’