దక్షిణాదిన కర్ణాటకలో ఒక వంక ముజీబ్ వివాదమే ముస్లిం బాలికలు ఆందోళన చేస్తుండగా, మరోవంక ఉత్తరాదిన ఉత్తర ప్రదేశ్ లో ఒక ముస్లిం బాలిక లక్నో యూనివర్సిటీలో ఎంఎ సంస్కృతంలో అత్యధిక మార్కులు పొంది, ఏకంగా ఐదు గోల్డ్ మెడల్స్ సాధించుకొని చరిత్ర సృష్టించింది. సంస్కసృతంలో పిహెచ్ డి చేసి, ప్రొఫెసర్ కావాలన్నదే ఒక రోజువారీ కూలి కుమార్తె అయిన బాలిక చెబుతున్నది.
నవంబర్లో జరిగిన కాన్వొకేషన్ వేడుకలో ఘజాలా ఈ పతకాలను స్వీకరించవలసి ఉన్నప్పటికీ, కరోనా కారణంగా ఆమె వేడుకలో పాల్గొనలేక పోయింది. దానితో గత గురువారం, డీన్ ఆర్ట్స్ ప్రొఫెసర్ శశి శుక్లా గజాలాకు పతకాలను ప్రదానం చేశారు.
రోజువారీ కూలీ కుమార్తె, గజాలా ఏకంగా ఐదు భాషలలో ప్రావీణ్యం సంపాదించింది — ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, అరబిక్, సంస్కృతం. ఆమె 10వ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఆమె చదువు కొనసాగించడానికి చాలా కష్టపడింది. “ఈ పతకాలు నా వల్ల కాదు, నా సోదరులు — షాదాబ్, నయాబ్ — వరుసగా 13, 10 సంవత్సరాల వయస్సులో చదువు మానివేసి, గ్యారేజీలో పని చేయడం ప్రారంభించడంతో, నేను చదువు కొనసాగించ గలిగాను” అని గజాలా చెప్పారు.
ఆమె అక్క యాస్మీన్ కూడా పాత్రల దుకాణంలో పని చేయడం ప్రారంభించింది. ఆమె తల్లి నస్రీన్ బానో వారి ఇంటిని చూసుకుంటుంది. గజాలా తన కుటుంబంతో ఒక గది ఇంట్లో నివసిస్తుంది. ‘నమాజ్’ చేయడానికి ఉదయం 5 గంటలకు నిద్రలేస్తుంది. ఇంటి పనులన్నీ చేస్తుంది. రోజుకు దాదాపు ఏడు గంటల పాటు సంస్కృతం చదువుతుంది.
ఈ ఐదు గోల్డ్ మెడల్స్ తమ ఐదుగురు కుటుంభ సభ్యులు – తల్లి,ఇద్దరు సోదరులు, అక్కలతో సహా ప్రతిబింబాలని ఆమె గర్వంగా చెప్పింది. విశ్వవిద్యాలయ సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో సంస్కృత శ్లోకాలు, గాయత్రి మంత్రం, సరస్వతీ వందనాలను పఠిస్తూ ఆమె క్యాంపస్ లో ప్రఖ్యాతి పొందారు.
సంస్కృత ప్రొఫెసర్గా ఎందుకు ఉండాలనుకుంటున్నారని అడిగినప్పుడు, ఆమె ఇలా చెప్పింది: “భాషాసు ముఖ్య మధురా దివ్య గీర్వాన్ భారతీ. సత్రాపి కావ్యం మధురం తస్మాద్పు సుభాషితమ్ (అన్ని భాషలలో, దేవుని స్వంత భాష సంస్కృతం తల్లి: దివ్యమైనది సాహిత్యపరంగా గొప్పది. సంస్కృతంలో కవిత్వం మరింత శ్రావ్యంగా ఉంటుంది. ఇందులో మంచి పద్యాలకు ప్రధాన స్థానం ఉంటుంది)” అని చెప్పింది.
ఆమె ప్రకారం, సంస్కృతంపై ఆమె ఆసక్తి నిషాత్గంజ్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నప్పుడు ప్రారంభమైంది. అక్కడ ఆమె ఉపాధ్యాయురాలు మీనా ఆమెకు 5వ తరగతిలో సంస్కృతం బోధించారు. “తర్వాత నేను ఆర్యకన్య ఇంటర్ కాలేజీలో అడ్మిషన్ పొందాను. ఒక తెలివైన సంస్కృత ఉపాధ్యాయురాలు అర్చన ద్వివేదిని పొందాను. ఫలితంగా, నేను మార్కులు చాలా బాగా స్కోర్ చేసాను” అని వివరించింది.
” నగ్మా సుల్తాన్, కరామత్ హుస్సేన్ ముస్లిం బాలికల పిజి కాలేజీలో బిఎ సమయంలో నాకు సంస్కృతం బోధించారు. ఎంఎ సమయంలో ఎల్యులో ప్రయాగ్ నారాయణ్ మిశ్రా” అని ఆమె చెప్పింది.
“నా సంస్కృత జ్ఞానం, ఆసక్తి తరచుగా ముస్లింను అయిన నన్ను నేను భాషపై ప్రేమను ఎలా పెంచుకున్నాను అని అడుగుతూ చాలామంది వ్యక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. దానిని నేను ఏమి చేస్తానని వారు నన్ను అడుగుతారు. కానీ నా కుటుంబం ఎల్లప్పుడూ నాకు మద్దతు ఇస్తుంది,” అని గజాలా చెప్పారు.
గజాలా ఇప్పుడు వేద సాహిత్యంలో పిహెచ్ డి చేయాలనుకుంటున్నారు. “ఫోన్లో ఆన్లైన్ తరగతులకు హాజరుకాకుండా ఒక రోజు స్టడీ టేబుల్, ల్యాప్టాప్ పొందాలని కలలు కనే నాలాంటి ఒక సాధారణ పేద బాలికకు ఇన్ని మెడల్స్ ఈ పతకాలు ఎంత పెద్దవో మీరు ఊహించలేరు” అంటూ గర్వంగా ఆమె చెప్పుకొచ్చింది.