వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శవలింగం బయటపడిన కొలను ఉన్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ ను సుప్రీం కోర్ట్ ఆదేశించింది. అదే సమయంలో, జ్ఞానవాపి మసీదులో నమాజ్ చేసుకునేందుకు అనుమతించాలని సూచించింది.
జ్ఞానవాపి మసీద్ కాంప్లెక్స్లో వీడియోగ్రాఫిక్ సర్వేకు వారణాసి కోర్టు ఆదేశించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అంజుమాన్ ఇంతెజమీయా మసీద్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడా సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించే బాధ్యత కలెక్టర్కు అప్పగించింది.
మరోవంక, ఈ కేసు విచారిస్తున్న వారణాసి కోర్టు కోర్ట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రాను తొలగించింది. అజయ్ కుమార్ మిశ్రా పూర్తి స్థాయిలో సహకరించడం లేదనే ఆరోపణలు రావడంతో ఆయనను తొలగించింది.
మరోవైపు నివేదిక సమర్పించేందుకు రెండు రోజుల సమయం కావాలని అసిస్టెంట్ కోర్ట్ కమిషనర్ అజయ్ ప్రతాప్ సింగ్ న్యాయస్థానాన్ని కోరారు. దీంతో కోర్టు 2 రోజుల గడువిచ్చింది. సోమవారం, శివలింగం బయటపడిన ప్రాంతాన్ని సీల్ చేసి, భద్రత కల్పించాలని వారణాసి కోర్ట్ ఆదేశించింది.
1 Comment
ఇదేమి న్యాయం !!
జ్ఞానవాపి వివాదంలో కమీషనర్ మిశ్రా గారిని అకస్మాత్తుగా తొలగించటం, ప్రార్ధనలు యధావిధిగా జరుపుకోవచ్చని సుప్రీం న్యాయస్థానం అదేశించటం, శివలింగం దొరికిందని చెప్పబడ్డ గదిని సీలు చేయటం, నివేదికలను బహిర్గతం చేయకూడదని అదేశించటం. ఇవన్ని వింటూంటే న్యాయస్థానాలు ధర్మంగా నడుస్తున్నాయా, నడుస్తాయా అన్న అనుమానం నాకు కలుగుతున్నది.
మరో అనుమానం : సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ కమ్యునిస్టులు. హిందూ వ్యతిరేకులు అని.