ఇటీవల ఓ బ్రాహ్మణ సమావేశంలో మాట్లాడిన బీజేపీ నేత, నాలుగుసార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికైన అరవింద్ శర్మ హర్యానాలో బ్రాహ్మణ ముఖ్యమంత్రి కావాలని వాదించారు. ఒకప్పుడు 20-22 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాల్లో బ్రాహ్మణ సీఎంలు ఉండేవారని గుర్తు చేశారు.
ఈ నెల ప్రారంభంలో, కేంద్ర మంత్రి, మహారాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షుడు రావుసాహెబ్ దాన్వే సహితం ఇలా అన్నారు: “బ్రాహ్మణులను మున్సిపల్ కౌన్సిలర్లు లేదా కౌన్సిల్ అధ్యక్షులుగా చూడాలని నేను కోరుకోవడం లేదు. ఈ రాష్ట్రానికి ఒక బ్రాహ్మణుడు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాలని నేను కోరుకుంటున్నాను”.
భారతదేశ జనాభాలో 10 శాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, దేశ రాజకీయ వ్యవస్థలో సుదీర్ఘకాలం వహించిన ఆధిపత్యం ఇప్పుడు క్షీణిస్తూ ఉండడం పట్ల కలత చెందుతున్న బ్రాహ్మణ సమాజానికి చెందిన అనేక మంది నాయకుల మనోభావాలనే వారు వ్యక్తం చేసారని చెప్పవచ్చు.
బహిరంగంగా ఎవ్వరు చెప్పక పోయినప్పటికీ, అత్యధిక జనాభా కలిగిన, రాజకీయంగా ముఖ్యమైన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో సహితం ఇటువంటి అభిప్రాయాలే బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ జనాభాలో కేవలం 12 శాతం మాత్రమే ఉన్న బ్రాహ్మణుల నుండి 1989 వరకు, సుమారు 40 సంవత్సరాల కాలంలో 8 మంది ముఖ్యమంత్రులు అయ్యారు.
అయితే, ఆ తర్వాత మండల్ రాజకీయాల ప్రభావంతో వారి నుండే మరెవ్వరు సీఎం కాలేక పోయారు. సమీప భవిష్యత్ లో సహితం దేశంలో అతిపెద్ద రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, బీహార్ లలో బ్రాహ్మణులు సీఎం అయ్యే అవకాశం కనిపించడం లేదు. యుపిలో ఇప్పుడు సిఎం యోగి ఆదిత్యనాథ్ యాహాయంలో ఠాకూర్ల చుట్టూ అధికారం బలపడుతూ “ఠాకూర్ అనుకూల” పాలన సాగుతున్నట్లు బలమైన వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఒక బిజెపి నాయకుడు ఇలా అంటాడు: “ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణులు ఎక్కువ సంఖ్యలో ఉండకపోవచ్చు, కానీ మా ప్రభావం ఎక్కువగా ఉంది. అఖిలేష్ యాదవ్ (సమాజ్వాదీ), మాయావతి (బిఎస్పి)లు కూడా బ్రాహ్మణులను తమవైపు తిప్పుకోవడానికి రాజకీయ వ్యూహాన్ని రచించిన తర్వాతే అధికారంలోకి రాగలిగారు. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు” అని ఓ సీనియర్ బిజెపి నేత స్పష్టం చేశారు.
హిందుత్వ, అగ్రవర్ణాలపై ఆధారపడటం, ఓబీసీ ఓట్లను దూకుడుగా తమ వైపు తిప్పుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి 12 చెందిన మంది దేశంలో ముఖ్యమంత్రులు ఉండగా ఈ సామాజిక వర్గం నుండి కేవలం అస్సాంలో మాత్రమే హిమంత బిస్వా శర్మ సీఎంగా ఉన్నారు.
ఇంతకు ముందు కేంద్రంలో ఎన్డీయే అధికారంలో ఉన్న సమయంలో, ఏబీ వాజ్పేయి హయాంలో బ్రాహ్మణ బీజేపీ సీఎంలు ఎవ్వరు లేరు. “వాజ్పేయి బ్రాహ్మణుడు. ఓబిసి, దళితులలో పార్టీని విస్తరింప చేయడం కోసం బ్రాహ్మణులు ఎవ్వరిని సీఎంగా చేయ లేదు” అని ఓ బిజెపి నేత చెప్పారు.
నేటి ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం హిందువులందరి నాయకుడిగా ఎదిగారు. అయినప్పటికీ, ఓబీసీలు, దళితులను దగ్గరకు తీసుకురావడానికి బిజెపి గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. అందుచేత, మోదీ `హిందుత్వ’ ఇమేజ్ కన్నా ఆయన ఓబీసీ మూలాలను ప్రధానంగా ప్రస్తావించే అవసరం ఏర్పడుతున్నది.
పార్టీ తన పరిధిని విస్తరించుకునే ప్రయత్నంలో ఓబీసీలు, దళితులకు చాలా అనుకూలంగా మారుతుందని ఆ పార్టీ బ్రాహ్మణ నాయకులు భావిస్తున్నారు. అయితే, “వెనుకబడిన వర్గాలలో మంత్రులుగా లేదా పదవులు పొందిన వారు, వివక్ష లేదా పేదరికాన్ని ఎన్నడూ ఎదుర్కోని తరానికి చెందినవారు” అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
“పార్టీ నాయకులు జాతవ్ దళితులు (లేదా, బీఎస్పీ ప్రధాన పునాది కాని దళితులు), యాదవేతర ఓబిసిలు (యాదవులతో సమాజ్వాదీ పార్టీని అనుబంధించే) ప్రధాన లక్ష్యంగా మద్దతు సమకూర్చుకొని ప్రయత్నం చేస్తున్నాము. వీరి మద్దతును గెలుచుకోగలిగితే, కనీసం 10 సంవత్సరాలు తాము హాయిగా ఉంటామని వారు భావిస్తున్నారు” అంటూ యుపిలో ఓ బిజెపి నాయకుడు తెలిపారు.
అయితే, బ్రాహ్మణ సామాజిక వర్గంలోని అసంతృప్తి కట్టడి చేయడం కోసం బిజెపి విశేషంగా ప్రయత్నం చేస్తున్నది. ఇటీవలి యుపి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ నేతలను కలవడానికి ఒక కమిటీని నియమించారు. ఇది దాదాపు 40 మంది బ్రాహ్మణ నాయకులను ఈ కమిటీ కలుసుకుంది.
యుపిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో అగ్రవర్ణాల్లో అత్యధికంగా ఉన్న 68 మంది బ్రాహ్మణ అభ్యర్థులను బీజేపీ నిలబెట్టింది. యోగి ఆదిత్యనాథ్ మొదటి ప్రభుత్వంతో పోల్చితే రెండో సారి 2.0 ప్రభుత్వంలో బ్రాహ్మణులకు కూడా ప్రాతినిధ్యం పెరిగింది. అందుకు ప్రధాని మోదీ జోక్యమే కారణం అని బిజెపి కీలక నాయకులు స్పష్టం చేస్తున్నారు.
ఆదిత్యనాథ్ క్యాబినెట్లో ఇప్పుడు ఎనిమిది మంది బ్రాహ్మణ మంత్రులు ఉన్నారు. ఠాకూర్ల కంటే ఇద్దరు ఎక్కువ. అయితే, మురళీ మనోహర్ జోషి లేదా కల్రాజ్ మిశ్రా వంటి వారి స్థాయికి చెందిన బ్రాహ్మణ నాయకులు ఇప్పుడు బీజేపీలో లేరన్నది మాత్రం స్పష్టం.
ప్రతిపక్షాలు సహితం బలమైన బ్రాహ్మణ నాయకులను ప్రోత్సహించక పోవడంతోనే బిజెపి వారి మద్దతు పొందగలుగుతుందని, ప్రభావంతమైన బ్రాహ్మణ నేతలను గతంలో మాయావతి లేదా కాంగ్రెస్ వలే ప్రజల ముందు ఉంచగలిగితే పరిస్థితులు మారతాయని కొందరు బిజెపి వారిస్తున్నారు.