జూన్ 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు 10 మంది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ నుండి అసంతృప్తి స్వరాలు చెలరేగుతున్నాయి. ఈ మధ్యనే ఉదయపూర్ లో జరిగిన చింతన్ సివిర్ లో నిర్ణయాలకు పార్టీ నాయకత్వం తిలోదకాలిచ్చిందనే విమర్శలు చెలరేగుతున్నాయి.
ఒక కుటుంభంలో ఒకే సీట్ నిబంధనను గాలికి వదిలివేశారని సీనియర్లు మండియపడుతున్నారు. కొడుకు ఎంపీగా ఉన్నా 76 ఏళ్ళ చిదంబరంకు రాజ్యసభ సీట్ అవ్వడం, కూతురు యుపిలో ఎమ్మెల్యేగా ఉన్నా ప్రమోద్ తివారీకి రాజస్థాన్ నుండి సీట్ ఇవ్వడం ఏమిటనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
జి23 లేఖలో కీలక పాత్ర వహించిన గులాబీ నబి ఆజాద్, ఆనంద్ శర్మలను వదిలి వేయడం గమనిస్తే గాంధీ కుటుంభం `భజన పరులు’ మాత్రమే పార్టీలో ఉండాలనే సంకేతం ఇచ్చిన్నట్లయింది. నటిగా మారిన రాజకీయ నాయకురాలు నగ్మా మొరార్జీ అభ్యర్థిత్వాలపై ప్రశ్నలను లేవనెత్తారు.
కేంద్ర మాజీ మంత్రులు పి చిదంబరం, జైరాం రమేష్, అజయ్ మాకెన్లతో పాటు ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలాను బరిలోకి దింపుతున్న కాంగ్రెస్ ఆదివారం ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఆదివారం రాత్రి ట్విటర్లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, “షాయద్ మేరీ తపస్య మే కుచ్ కమీ రెహ్ గయీ (బహుశా నా తపస్సు తగ్గి ఉండవచ్చు)” అని ట్వీట్ చేశారు. అయితే, కాంగ్రెస్ తనకు గుర్తింపునిచ్చిందంటూ ఆయన సోమవారం ఉదయం మరో ట్వీట్ చేశారు.
“నేను నా ఈ అభిప్రాయంతో ఏకీభవించడమే కాకుండా దానికి కట్టుబడి ఉన్నాను” అని ఆయన స్పష్టం చేశారు, కొన్ని రోజుల క్రితం తన ట్వీట్లలో ఒకదాన్ని ట్యాగ్ చేస్తూ, కాంగ్రెస్ నాయకులు తమ గుర్తింపు పార్టీ కారణంగానే అని మర్చిపోకూడదు.
పవన్ ఖేరా ట్వీట్కు నగ్మా స్పందిస్తూ.. ”నా 18 ఏళ్ల తపస్సు కూడా ఇమ్రాన్ భాయ్ ముందు తక్కువైంది” అంటూ పార్టీపై విమర్శలు గుప్పించారు. ”2003-04లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు స్వయంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీనే నన్ను రాజ్యసభకు పంపుతానని మాటిచ్చారు. అప్పటి నుంచి ఈ 18 ఏళ్లలో వారు నాకు ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్ ప్రతాప్ గర్హిని ఎంపిక చేశారు. ఆ పదవికి నా అర్హత తగ్గిందా ?” అంటూ కాంగ్రెస్ను ఆమె ప్రశ్నించారు.
నగ్మా ట్వీట్పై కాంగ్రెస్ నాయకుడు ఆచార్య ప్రమోద్ కృష్ణం స్పందిస్తూ సల్మాన్ ఖుర్షీద్, తారిక్ అన్వర్, గులాం నబీ ఆజాద్ల తపస్సు 40 ఏళ్లకు పైగా ఉందని, అయితే వారు కూడా “అమరవీరులు” అని ట్వీట్లో పేర్కొన్నారు. “ప్రతిభను ‘అణచివేయడం’ పార్టీకి ‘ఆత్మహత్య చర్య’ అని ఆయన హిందీలో మరో ట్వీట్లో పేర్కొన్నారు.
రాజస్థాన్లోని సిరోహికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే సన్యామ్ లోధా పార్టీపై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్కు చెందిన ఏ కాంగ్రెస్ నాయకుడు/కార్యకర్తను రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థి కాకపోవడానికి కారణం ఏమిటో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి? అంటూ అతను హిందీలో ఒక ట్వీట్లో వ్రాసాడు. రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ వాద్రాలను ట్యాగ్ చేశాడు.
పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా ప్రకారం తమిళనాడు నుంచి చిదంబరం, కర్ణాటక నుంచి రమేష్, హర్యానా నుంచి మాకెన్, రాజస్థాన్ నుంచి సూర్జేవాలా బరిలోకి దిగారు. రాజస్థాన్ నుంచి ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ తంఖా, ఛత్తీస్గఢ్ నుంచి రాజీవ్ శుక్లా, రంజీత్ రంజన్, మహారాష్ట్ర నుంచి ప్రతాప్గఢీలను కూడా పార్టీ బరిలోకి దించింది.
కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్గఢ్లతో పాటు మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లలో `బయటి వ్యక్తుల’నే ఎంపిక చేశారు. రాజ్యసభ సీట్ ఆశించిన కర్ణాటక సీనియర్ నేత హెచ్ఎన్ చంద్రశేఖర్ అలియాస్ ముఖ్యమంత్రి చంద్రూ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి ఆయన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్కు పంపాడు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు 10 రాజ్యసభ సీట్లు గెల్చుకొనే అవకాశం ఉంది. జూన్, ఆగస్టు మధ్య వేర్వేరు తేదీల్లో సభ్యుల పదవీ విరమణ కారణంగా ఖాళీ అయిన 15 రాష్ట్రాల నుండి 57 రాజ్యసభ స్థానాలను భర్తీ చేయడానికి జూన్ 10 న ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మే 31.