రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడానికి మహాత్మా గాంధీ మానవుడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ తాజాగా నిరాకరించారు. ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రతిపాదించిన మాజీ ఉప ప్రధాని, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూఖ్ అబ్దుల్లా కూడా తిరస్కరించారు.
దానితో ప్రతిపక్దాలు ఏకగ్రీవంగా ప్రతిపాదించిన ముగ్గురు కూడా ఎన్నికలలో పోటీకి విముఖత చూపడంతో మరో అభ్యర్హ్డిని ఎంపిక చేయవలసి ఉంది. ఈ విషయమై మంగళవారం ప్రతిపక్ష నేతలు శరద్ పవార్ నేతృత్వంలో సమావేశం అవుతున్నారు.
ఈ సందర్భంగా గోపాలకృష్ణ గాంధీ మాట్లాడుతూ.. దేశ అత్యున్నత పదవికి పోటీ చేయాలని చాలా మంది గొప్ప నేతలు తనను అడగడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని లోతుగా పరిశీలించిన తర్వాత రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి విపక్షాల ఐక్యతతో పాటు యావత్ దేశ ఏకాభిప్రాయాన్ని సాధించే వ్యక్తి అయి ఉండాలని అనిపించిందని ఆయన పేర్కొన్నారు.
ఈ విషయంలో తనకంటే మెరుగైన వ్యక్తులు ఉన్నారనిపించింద, అందుకే తాను పోటీ చేయాలనుకోవడం లేదని ఆయన తెలిపారు.గోపాలకృష్ణ గాంధీ పేరును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతవారం 15న జరిగిన సమావేశంలో ప్రతిపాదించిన సంగతి గమనార్హం.
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అత్యవసర సమావేశం కానున్నారు. సోమవారం సాయంత్రం గంటలకు పార్లమెంట్ భవనంలోని రూం నెం. 25లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలోని ఎంపీలంతా సమావేశం కావాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది.