మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్య థాకరేపై తిరుగుబాటు జరిపి, ఎనిమిది మంది మంత్రులతో సహా మూడింట రెండు వంతుల మందికి పైగా ఎమ్యెల్యేతో గౌహతిలో మకాం వేసిన శివసేన సీనియర్ నాయకుడు ఎకనాథ్ రానిదే కు నెలరోజుల క్రితమే ముఖ్యమంత్రి పదవిని థాకరే ఇవ్వజూపినట్లు తాజాగా చెబుతున్నారు. స్వయంగా ఈ విషయాన్నీ మంత్రిగా ఉన్న థాకరే కుమారుడు ఆదిత్య థాకరే వెల్లడించారు.
ఈ ప్రతిపాదనను మే 20న చేయగా, షిండే నుండి సరైన సమాధానం లేదని చెప్పారు. సరిగ్గా నెల రోజుల తర్వాత `తిరుగుబాటు’ చేటుచేసుకోవడం గమనార్హం. అయితే, `తిరుగుబాటు’ను ముందే ఊహించి ఈ ప్రతిపాదన చేశారా? అనే అనుమానం కలుగుతుంది.
వాస్తవానికి 2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి పదవిని రెండు పార్టీలు కలసి చేరి సగం రోజులు పంచుకోవాలని అనుకున్నట్లు థాకరే చెబుతున్నారు. ఆ హామీకి బిజెపి నిలబడక పోవడం వల్లననే ప్రభుత్వం బిజెపితో కలసి ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదని అంటున్నారు.
కానీ, అటువంటి అవగాహన ఏదీ జరగలేదని స్వయంగా హోమ్ మంత్రి అమిత్ షా ఆ తర్వాత కొట్టిపారేసారు.
ఈ ఫార్ములా ప్రకారం శివసేనకు రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఉంటె, షిండేనే ముఖ్యమంత్రి అయి ఉండేవారని ఇప్పుడు ఆదిత్య గుర్తు చేస్తున్నారు. ఆయనను ముఖ్యమంత్రి కానీయకుండా అడ్డుకున్న బిజెపితో ఇప్పుడు చేతులు కలుపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలిసి మహా వికాస్ అఘాది కూటమి ఏర్పాటులో సహితం షిండే క్రియాశీలకంగా పాల్గొనడం గమనార్హం. వాస్తవానికి ఆ సమయంలో షిండేను ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రతిపాదించారు. కానీ సోనియా గాంధీ, శరద్ పవార్ పట్టుబట్టడంతో ఉద్ధవ్ ఆ పదవి చేపట్టవలసి వచ్చింది.
మహారాష్ట్ర ప్రభుత్వంలో అన్నింటికన్నా కీలకమైనది పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖగా భావిస్తుంటారు. అందుకనే గత మూడు దశాబ్దాలకు పైగా ఆ శాఖను ముఖ్యమంత్రిగా ఎవ్వరుంటే వారు తమ వద్దనే ఉంచుకొంటూ వస్తున్నారు. అయితే, ఉద్ధవ్ అటువంటి కీలకమైన మంత్రిత్వ శాఖను షిండేకు కేటాయించారు. అంతేకాదు, ఆయన కుమారుడిని లోక్ సభకు ఎన్నికయ్యేటట్లు చేశారు. తిరుగుబాటుకు వారం రోజుల క్రితమే ఆదిత్య థాకరేతో కలసి అయోధ్య యాత్రకు వెళ్లి వచ్చారు. ఇంతలో ఈ `తిరుగుబాటు’ జరపడం అంటే చాలామంది శివ సైనికులు నమ్మలేక పోతున్నారు. అందుకు ఇతరత్రా వత్తిడులు ఉండివచ్చని భావిస్తున్నారు.