విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రం కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ఈ మేరకు ప్రధానికి సోమవారం గన్నవరం ఎయిర్పోర్టులో ప్రధాని వీడ్కోలు పలికే సమయంలో సిఎం వినతిపత్రం సమర్పించారు.
భీవమరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఢిల్లీ పయనమైన ప్రధాని నరేంద్ర మోదీకి గన్నవరం ఎయిర్పోర్టులో సిఎం వీడ్కోలు పలికారు. రిసోర్స్గ్యాప్ గ్రాంటు అంశాన్ని విజ్ఞాపనపత్రంలో పేర్కొన్న సిఎం రూ.34,125.50 కోట్లను ఇవ్వాలని కూడా కోరారు.
ముఖ్యంగా తెలంగాణా డిస్కమ్ల నుండి రావాల్సిన రూ.6,627 కోట్లను ఇప్పించాలని ప్రధానికి విజ్జప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలిపాలని ముఖ్యమంత్రి కోరారు. జాతీయ ఆహార భద్రతాచట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్ విషయంలో హేతుబద్ధత లేదని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన తెలిపారు. దీనిని సవరించి రాష్ట్రానికి మేలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన దంత వైద్య కళాశాలలకు తగిన ఆర్థికసాయం చేయాలని, భోగాపురం ఎయిర్పోర్టుకు క్లియరెన్స్లు మంజూరు చేయాలని వినతిపత్రంలో జగన్ పేర్కొనాురు. ఎపిఎండిసికి ఇనుప గనులు కేటాయించాలని కోరారు. వినతిపత్రం సమర్పించే సమయంలో మచిలీపటుం ఎంపి వల్లభనేని బాలశౌరి కూడా వారి వెంట ఉనాురు.