పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రెండో వివాహం గురువారం నిరాడంబరంగా జరిగింది. కొద్ది మంది అతిథుల సమక్షంలో డాక్టర్ గుర్ప్రీత్ కౌర్ను సీఎం మాన్ వివాహమాడారు. చంఢీగఢ్లో సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్ధా సైతం భగవంత్ మాన్ వివాహానికి హాజరయ్యారు. బంగారు వర్ణం దుస్తులు, పసుపు రంగు టర్బన్ను ధరించి వెలిగిపోయారు భగవంత్మాన్. ఆయన తల్లి, సోదరి, అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఈ రోజు నుంచి కొత్త జీవితం ప్రారంభించబోతున్న భగవంత్ మాన్కు శుభాకాంక్షలు అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
అంతకుముందు తన సోదరుడికి పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉందని ఆప్ నేత రాహుల్ చద్దా తెలిపారు. భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనేది ఆయన తల్లి కల అని, ఇప్పుడు అది నెరవేరడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మాన్కు భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ అంబాలా నగరంలోని ఓ ఆసుపత్రిలో వైద్యురాలిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. భగవంత్ మాన్, డాక్టర్ గురుప్రీత్ కౌర్ ఒకరికొకరు నాలుగేళ్లుగా తెలుసునని ఆమె బంధువులు చెబుతున్నారు.
గుర్ప్రీత్ 2019లో మన్ను కలిశారని, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనతో కలిసి ఎన్నికల ప్రచారం కూడా చేశారని కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. మాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి గురుప్రీత్ కూడా హాజరయ్యారు.ముఖ్యమంత్రిగా పని చేస్తూ పెళ్లి చేసుకున్న మొట్ట మొదటి పంజాబ్ రాజకీయ నాయకుడిగా మాన్ చరిత్ర సృష్టించారు.
భగవంత్ పెళ్లిలో అతిథులకు భారతీయ, ఇటాలియన్ వంటలు సిద్ధం చేయించారు. కరాహీ పనీర్, తందూరి కుల్చే, దాల్ మఖానీ, నవరత్న బిర్యానీ, మౌసమీ సబ్జీలు, ఆప్రికాట్ స్టఫ్డ్ కోఫ్తా, లసగ్న సిసిలియానో, బుర్రానీ రైత వంటి రకరాకల వంటలు తయారు చేశారు.