‘నదులకే నడకను నేర్పినట్టుగా సీఎం కేసీఆర్ చెప్పుకుంటున్నారు కదా.. వర్షాలకు నీళ్లలో మునిగిన కాళేశ్వరం మోటార్లకు ఈత ఎందుకు నేర్పించలేకపోయారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తోనే ముంపునకు గురయ్యాయని పేర్కొంటూ ఇరిగేషన్ ఇంజనీర్ అవతారమెత్తి రీడిజైన్ పేరు తో రూ.30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని రూ.1.30 లక్షల కోట్లకు పెంచి ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు.
గురు వారం సిద్దిపేట అర్బన్ మండలం నాంచార్పల్లి నుంచి బీజేపీ చేపట్టిన ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీని సంజయ్ బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల బాధలు పోవాలన్నా, అభివృద్ధి జరగాలన్నా బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ‘దేశ్ కీ నేత.. దిన్ బర్ పీతా.. మోదీపే రోతా.. ఫాంహౌస్ మే సోతా.. అమాస పున్నానికి ఆతా..’ అంటూ ఎద్దేవా చేశారు.
అడుగడుగునా అవమానించినా అల్లుడికి సిగ్గులే దని, నోటి నిండా అబద్ధాలే వల్లిస్తున్నాడంటూ హరీశ్రావుపై మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కొల్లగొట్టిన వారికి మద్దతుగా ఆందోళనలు చేయ డం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ ఈడీ విచారణను ఎదు ర్కోక తప్పదని హెచ్చరించారు. రైతులకు రైతుబంధు మాత్రమే ఇచ్చి అన్ని బంద్ చేశార న్నారు. తడిసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని 5 జిల్లాలలో ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర చేపట్టినట్లు బండి సంజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 10 రోజుల పాటు మురళీధర్ రావు పాల్గొంటారని చెప్పారు. ప్రజలు వాస్తవ పరిస్థితులను చెప్పడానికే ఈ భరోసా యాత్ర చేపట్టామన్నా ఆయన అక్టోబర్ 2 నుండి ప్రజా సంగ్రామ యాత్ర మొదలవుతుందని తెలిపారు.
ఫాంహౌస్ పాలన చేసే సీఎం ఉండడం మన దౌర్భాగ్యామని ధ్వజమెత్తారు. 30 వేల కోట్ల ప్రాజెక్ట్ ను లక్షా 30 వేల కోట్ల రూపాయలకు పెంచి ప్రజలు సొమ్మును దోచేసిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. నదులకు నడక నేర్పిన కేసీఆర్ నీళ్లలో మునిగిన మోటార్లకు ఈత నేర్పలేదా అని ప్రశ్నించారు.
రైతుబంధు మాత్రమే ఇచ్చి దళితబంధు సహా అన్నింటిని ఆపేశారని బండి సంజయ్ ఆరోనించారు. పంటలకు మద్ధతు ధర పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అని పేర్కొంటూ మోదీ రాక ముందు రూ 1310 ఉన్న మద్ధతు ధర ఇప్పుడు రూ 1960 ఉందని చెప్పారు. తడిసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామిక తెలంగాణ తేవడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. శ్రీలంక పరిస్థితులే రాష్ట్రంలో ఉన్నాయని చెబుతూ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. విద్యుత్, బస్, పెట్రోల్ చార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్న కేసీఆర్..కేంద్రంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.