మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను సోమవారం శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి సమర్పించారు. తన రాజీనామాను స్పీకర్ పోచారం ఆమోదించారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అంతకుముందు గన్పార్కుకు చేరుకున్న రాజగోపాల్ రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
అనంతరం మీడియాతో మాడుతూ రాజీనామా లేఖను స్పీకర్కు అందించానని, తన రాజీనామాను ఆమోదించారని పేర్కొన్నారు. టిఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీ అయిందని ఈ సందర్భంగా రాజగోపాలరెడ్డి విమర్శించారు. టిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న చాలా మంది నేతలు తనతో మాట్లాడుతున్నారని చెప్పారు.
టిఆర్ఎస్ ప్రభుత్వంపై ధర్మయుద్ధం ప్రకటించానని, దీనిలో తెలంగాణ, మనుగోడు ప్రజలు గెలుస్తారని రాజగోపాల్రెడ్డి చెప్పారు. చండూరు సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఆయన మనుషులు మాట్లాడిన భాష విన్న తర్వాత తెలంగాణ సమాజం తల దించుకుంటోందని విమర్శించారు.
డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్నవాళ్లు.. తప్పుడు పనులతో జైలుకెళ్లి వచ్చినవారు మాట్లాడుతున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఏ త్యాగం చేయకుండా, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనకుండా ఇప్పుడు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. కోమటిరెడ్డి సోదరులను తిట్టించిన భాష విన్న తర్వాత అందరూ ఆలోచించాలని రాజగోపాల్రెడ్డి కోరారు.
స్వార్దం ఉంటే పార్టీకి రాజీనామా చేయనని స్పష్టం చేశారు. మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేసినట్టు వెల్లడించారు. తనను నమ్ముకున్న వల్ల కోసం రాజీనామా చేసా అని పేర్కొంటూ ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. 60 యేండ్ల పోరాటం ఒక కుటుంబం కోసం కాదని విమర్శించారు. కాగా, ఈ నెల 21న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు.