:బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అంచనాలకు మించి రాణించిందనే చెప్పాలి. 210 మంది అథ్లెట్లతో భారీ బృందం ఇంగ్లండ్కు వెళ్లిన భారత బృందం 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్యాలతో సహా మొత్తం 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. గేమ్స్ ప్రారంభానికి ముందు టాప్ 5లో నిలవడం కష్టమేనని భావించినా.. ఆ మార్క్కు చేరుకుంది.
ఈసారి కూడా స్వర్ణ పతకాల వేటను వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానునే ప్రారంభించింది. మహిళల 49 కిలోల విభాగంలో ఆమె తొలి పసిడిని అందించింది. టేబుల్ టెన్నిస్లో వెటరన్ శరత్ కమల్ స్వర్ణంతో ఈ పతకాల వేట ముగిసింది. భారీ అంచనాలతో బరిలో దిగిన పురుషుల హాకీ జట్టు, మహిళల క్రికెట్ జట్టు రజత పతకాలతో సరిపెట్టుకున్నాయి.
మొత్తం 72 దేశాల నుంచి 20 క్రీడాంశాలకు సంబంధించి 5 వేలమందికి పైగా అథ్లెట్లు పాల్గంటే.. భారత్ నుంచి 210 మంది ప్రాతినిధ్యం వహించారు. ఆతిథ్య ఇంగ్లండ్ నుంచి అత్యధికంగా 438 మంది, ఆ తర్వాత ఆస్ట్రేలియానుంచి 427మంది పాల్గన్నారు.
2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ క్రీడలతో పోల్చిచూస్తే ఈసారి భేషుగ్గానే మన అథ్లెట్లు రాణించారు. ఈ క్రీడల్లో మొత్తం 61 పతకాలను సాధిచారు. గత క్రీడల్లో భారత్కు 66 పతకాలు దక్కితే.. ఈసారి ఐదు పతకాలు ఈసారి తగ్గాయి. 2018లో షూటింగ్ విభాగంలోనే 16 పతకాలు రాగా, ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్కు చోటు దక్కలేదు.
మహిళల క్రికెట్, బాస్కెట్బాల్ 3ా3, వీల్చైర్ బాస్కెట్ బాల్ 3ా3, మిక్స్డ్ సింక్రనైజ్డ్ డైవింగ్, పారా క్రీడలకు కామన్వెల్త్ క్రీడల్లో చోటు దక్కింది. అయినా మనకు 61 పతకాలతో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. మహిళల హాకీ జట్టు కాంస్యం సాధించింది. పారా క్రీడల్లో 2 పతకాలు దక్కాయి.
ఈసారి కూడా ఆస్ట్రేలియా పతకాల పట్టికలో అగ్ర స్థానంలో నిలవగా, ఆ తర్వాత ఆతిథ్య ఇంగ్లండ్, కెనడా ఉన్నాయి. చివరిరోజు వరకు 5వ స్థానంలో ఉన్న భారత్ ఏకంగా నాలుగు స్వర్ణాలను గెలిచి న్యూజిలాండ్ను వెనక్కి నెట్టి నాల్గోస్థానానికి ఎగబాకింది.
భారత్కు రెజ్లింగ్ విభాగంలో అత్యధికంగా 12 పతకాలు వచ్చాయి. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్లో 10 పతకాలు వచ్చాయి. 210మంది అథ్లెట్లతో భారీ బృందం ఇంగ్లండ్కు వెళ్తే 22 పతకాలు ఈ రెండు ఈవెంట్ల నుంచే వచ్చాయి. భారీ అంచనాలతో బరిలో దిగిన పురుషుల హాకీ జట్టు, మహిళల క్రికెట్ జట్టు రజత పతకాలతో సరిపెట్టుకున్నాయి.
గత కామన్వెల్త్ క్రీడల వరకు 1875 పతకాలు అందజేయగా,అందులో భారత్ 503 పతకాలను సొంతం చేసుకుంది. అందులో 181 స్వర్ణ, 173 రజత, 149 కాంస్యాలు ఉన్నాయి. భారత్ అత్యుత్తమంగా 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో 101(38 స్వర్ణాలు) పతకాలతో రెండో స్థానంలో నిలిచింది.