శ్రీలంకలో భారీగా విద్యుత్ రేట్లు పెరగనున్నాయి. ఏకంగా 264శాతం మేరా టారిఫ్లు పెంచనునుట్లు సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సిఇబి) మంగళవారం ప్రకటించింది. తక్కువ విద్యుత్ వినియోగించే వారికి ఎక్కువ పెంపు, ఎక్కువ విద్యుత్ వినియోగించే వారికి తక్కువ పెంపు వర్తించనున్నాయి.
విద్యుత్ బోర్డు 61.6కోట్ల డాలర్ల మేరా నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ నష్టాలను భర్తీ చేసుకోవడానికి బుధవారం నుండి చార్జీలను పెంచనున్నారు. అయితే తమ నష్టాలను భర్తీ చేసుకోవడానికి 800శాతానికి పైగా టారిఫ్లు పెంచుతామని సిఇబి కోరింది.
కానీ గరిష్టంగా పెంపు 264శాతం మాత్రమే వుండాలని విద్యుత్ నియంత్రణా సంస్థ స్పష్టం చేసిందని అధికారులు తెలిపారు. దేశంలోని 78లక్షల కుటుంబాల్లో మూడింట రెండు వంతుల మంది నెలకు 90కిలోవాట్ల కన్నా తక్కువే వినియోగిస్తారని అధికార రికార్డుల్లో వెల్లడైంది.
వీరందరూ అధిక టారిఫ్ల బారిన పడనునాురు. విద్యుత్ను అధికంగా ఉపయోగించే వినియోగదారులు 80శాతం కనాు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం యూనిట్ ధర రూ.2.50గా వుంది. ఇకపై తక్కువస్థాయి వినియోగదారులకు యూనిట్ ధర రూ.8గా వుండనుంది.
బడా వినియోగదారులు ఇప్పటివరకు యూనిట్కి 45రూపాయిలు చెల్లిస్తుండగా, ఇకపై 75 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. విదేశీ మారక నిల్వలు తరిగి పోవడంతో శ్రీలంక కనివినీ ఎరుగని రీతిలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ఆహారం, మందులు, ఇంధనం సహా నిత్యావసరాలనిుంటికీ తీవ్ర కొరత ఏర్పడింది. అధిక ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో సుదీర్ఘమైన బ్లాకవుట్లు కూడా సర్వసాధారణంగా మారాయి.