కేసీఆర్ నయా నిజాం అంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేసారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముంగిపు సందర్బంగా హన్మకొండ లో ఏర్పటు చేసిన బిజెపి భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా పాల్గొంటూ చివరి నిజాం కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేశారని … కేసీఆర్ కూడా మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ బాటలో నడుస్తున్నారని చురకలంటించారు.
నిజాం తరహాలోనే ప్రజలు కేసీఆర్ ను రాబోయే రోజుల్లో ఇంట్లో కూర్చోబెడుతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు ఇదే ముగింపు అని స్పష్టం చేశారు. వరంగల్ ప్రజలకు నమస్కారాలు అంటూ జేపీ నడ్డా ప్రసంగం మొదలు పెట్టారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు రావడం తనకు చాలా సంతోషంగా ఉందని చెబుతూ ముగింపు సభను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కుట్రలు చేసిందని మండిపడ్డారు. కానీ, హైకోర్టు అనుమతితో సభ ఏర్పాటు చేశామని చెప్పారు. తాను హైదరాబాద్లో అడుగు పెట్టినప్పటి నుంచి అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకు కూడా పాకిందని నడ్డా ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని ధ్వజమెత్తారు. రూ.40వేల కోట్ల అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును మొదలు పెట్టిన కేసీఆర్ సర్కారు.. ప్రాజెక్టు పూర్తయ్యే సరికి రూ.లక్ష 40 వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బందీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 12 జిల్లాల్లో వరదలు వస్తే కేంద్రం రూ.377 కోట్లు ఇస్తే..ఆ నిధులను సీఎం కేసీఆర్ ప్రజలకు ఇవ్వలేదని జేపీ నడ్డా ఆరోపించారు. జల్ జీవన్ స్కీం కింద కేంద్రం రూ.3,098 కోట్లు ప్రకటించిందని, కానీ, రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లే తీసుకుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కారు చాలా రకాలుగా నిధులు కేటాయించినా..వాటిని కేసీఆర్ డైవర్ట్ చేసి..కేంద్రంపై నిందలు మోపుతున్నారని నడ్డా ఆరోపించారు.
రాష్ట్రానికి కేంద్రం అనేక నిధులు ఇచ్చిందని చెబుతూ ఆ లెక్కలపై సీఎం కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సవాల్ చేశారు. తాను చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. .రాష్ట్రానికి ఎప్పటికప్పుడు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని, కానీ.. కేంద్రంపై విష ప్రచారం చేస్తోందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. వరంగల్ జిల్లాకు ఎన్ని నిధులు కేటాయించిందో చెప్పాలని సవాల్ విసిరారు. వీరభద్ర రామప్ప ఆలయానికి యునోస్కో గుర్తింపు తెచ్చిన ఘనత కేంద్రానికి దక్కుతుందని పేర్కొన్నారు. ఈ ఆలయానికి రూ. 60 వేల కోట్లు ఖర్చు పెట్టబోతోందని తెలిపారు.
వేయి స్తంభాల గుడి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని.. వేయి స్తంభాల కళా మంటపం పడిపోయినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. దీనిని డిసెంబర్ నెలలోపు పునరుద్ధిస్తామని హామీనిచ్చారు. వరంగల్ పోర్టుకు సౌండ్ అండ్ సిస్టం కోసం రూ. 5 కోట్లు కేటాయించినట్లు.. త్వరలోనే పనులు ప్రారంభమౌతాయని చెప్పారు.
కేసీఆర్ కోసం జిల్లాకో జైలు రెడీ చేశాం
‘జైలుకెళ్లి వచ్చా.. కేసీఆర్కు రూమ్ రెడీ చేసి వచ్చా’ అంటూ బండి సంజయ్ఎద్దేవా చేసారు. బీజేపీ కార్యకర్తలకు జైళ్లు కొత్త కాదని , ధర్మ రక్షకులు పీడీ యాక్ట్లకు భయపడరని స్పష్టం చేశారు. ఆంక్షల పేరుతో ప్రభుత్వం ప్రతిసారీ అడ్డుకుంటోందని మండిపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని చెబుతూ కేసీఆర్ కోసం ప్రతి జిల్లాకో జైలు రూమ్ రెడీ చేశామని వెల్లడించాయిరు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను అరెస్ట్ చేసినా యాత్ర ఆగలేదని గుర్తు చేశారు. మూసీ ప్రక్షాళన ఏమైందని ప్రశ్నించారు. డిండి ప్రాజెక్టు ఏమైందని నిలదీశారు.
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ..రాష్ర్టంలో టీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీజేపీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ర్టంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే రాబోతుందని భరోసా వ్యక్తం చేశారు. అ
లాగే ప్రజలకు పలు ప్రశ్నలు చిందించారు. వరి వేస్తే ఉరి అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలా..? 2021 వరకూ కోటి 42 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ కావాలా..? అని ప్రశ్నించారు.
భారీ వర్షాలు, వరదలతో పంటలు కొట్టుకుపోతే పట్టించుకోని సీఎం కేసీఆర్ కావాలా..? లేక ఫసల్ బీమా పథకంతో రైతులను ఆదుకుంటున్న మోదీ కావాలా..? నిరుపేదలకు, ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇంట్లు కట్టించి, ఇస్తానని చెప్పి మోసం చేసిన కేసీఆర్ కావాలా..? లేక దేశంలోని నిరుపేద మహిళలకు 3కోట్ల 20లక్షల ఇండ్లు కట్టించి ఇచ్చిన మోదీ కావాలా..? అని అరవింద్ అడిగారు.