దసరా సెలవుల తరువాత జమ్ముకాశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ఈ మేరకు శుక్రవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ 20కి పైగా పిటిషన్లు అత్యునుత న్యాయస్థానంలో దాఖలయ్యాయి. దాదాపు రెండు సంవత్సరాలు (2020 మార్చి 2 నుంచి)గా ఈ పిటిషన్లపై విచారణ జరగలేదు.
శుక్రవారం ఈ పిటిషన్లకు సంబంధించిన అంశాన్ని సిజెఐ యుయు లలిత్ ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది ప్రశాంతో సేన్ అత్యవసరంగా ప్రస్తావించారు. దీనికి జస్టిస్ లలిత్ స్పందిస్తూ దసరా సెలవుల తరువాత జాబితా చేస్తామని తెలిపారు. సుప్రీం కోర్టుకు అక్టోబర్ 3 నుంచి వారం రోజుల పాటు దసరా సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 10న సుప్రీం కోర్టు తిరిగి పున్ణప్రారంభమవుతుంది.
2019 డిసెంబర్లో ఈ పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి, జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. ఆర్టికల్ 370నిసవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాల్సిన అవసరం లేదని2020 మార్చి 2న ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.
ఈ ధర్మాసన సభ్యుల్లో జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి పదవీ విరమణ చేశారు. దీంతో సిజెఐ యుయు లలిత్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడింది.