ఈశాన్య భారతదేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ‘సింపో ఎన్ ఈ ‘ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో కేంద్ర పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రిజి.కిషన్ రెడ్డి ప్రారంభించారు. రెండు రోజుల పాటు సమావేశం జరుగుతుంది.
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా 2022 సెప్టెంబర్ 24, 27 తేదీల్లో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘సింపో ఎన్ ఈ ‘ని నిర్వహిస్తోంది. వర్చువల్ విధానంలో జరిగే సమావేశంలో ఈశాన్య భారతదేశంలో పర్యాటక రంగం అభివృద్ధికి గల అవకాశాలు, ఇంత కాలం ఎక్కువ గుర్తింపు పొందని పర్యాటక ప్రాంతాలకు గుర్తింపు సాధించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ కార్యక్రమాన్ని సమావేశం చర్చించి పర్యాటక రంగ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తారు.
పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడే వివిధ ఆలోచనలు, సూచనలను వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు, విధాన నిర్ణేతలు, సామాజిక మాధ్యమాలను ప్రభావితం చేయగల వ్యక్తులు, పర్యాటక సంస్థల ప్రతినిధులు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రతినిధుల నుంచి స్వీకరించి, చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తారు.
ఈశాన్య భారతదేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, పర్యాటక రంగంతో సంబంధం ఉన్న వివిధ వర్గాలతో విస్త్రుత్వంగా చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ‘సింపో ఎన్ ఈ ‘పేరిట సమావేశాలు నిర్వహించాలని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
రుచికర ఆహారం, సంస్కృతి, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, వారసత్వం మరియు వాస్తుశిల్పం కలిగి ఉన్న . ఈశాన్య భారతదేశం ప్రపంచంలో అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని పెంపొందించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి.దీనిని గుర్తించిన శ్రీ కిషన్ రెడ్డి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ‘సింపో ఎన్ ఈ ‘ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
కార్యక్రమాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి ఈశాన్య భారతదేశాన్ని పర్యాటకుల స్వర్గ ధామంగా వర్ణించారు.”ఈశాన్య భారతదేశం ప్రకృతి సౌందర్యం, విశిష్ట సంస్కృతుల అరుదైన సమ్మేళనం మరియు సహజ వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈశాన్య ప్రాంతం వేగంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉంది..” అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈశాన్య ప్రాంతంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి సాధించేందుకు గల అవకాశాలను ‘సింపో ఎన్ ఈ ‘ కార్యక్రమం ద్వారా గుర్తిస్తామని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి లోక్ రంజన్ అన్చెప్పానారు. ఈశాన్య ప్రాంత పర్యాటక రంగ అభివృద్ధిలో ‘సింపో ఎన్ ఈ ‘ఒక పెద్ద అడుగు గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.