జమ్ముకశ్మీర్ లో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాజౌరీలో నిర్వహించిన భారీ ర్యాలీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజ్జర్లు, బకర్వాల్, పహారీ సామాజిక వర్గాలను త్వరలో ఎస్టీ జాబితాలో చేర్చుతామని తెలిపారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు.
పహారీలకు ఎస్టీ హోదా మంజూరైతే దేశంలోనే ఒక భాష మాట్లాడే వర్గానికి రిజర్వేషన్లు కల్పించడం తొలిసారి కానుంది. ఇది జరగాలంటే కేంద్రం పార్లమెంట్ లో రిజర్వేషన్ల చట్టాన్ని సవరించాలి. జస్టిస్ శర్మన్ కమిషన్ గుజ్జర్లు, బకర్వాల్, పహారీలకు రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిందని, అవి త్వరలోనే అమలవుతాయని అమిత్ షా స్పష్టం చేశారు.
“ఈ మూడు సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని జస్టిస్ శర్మ కమిషన్ సూచించింది. దీనిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం చర్చలు ముగిశాక రిజర్వేషన్లు కల్పిస్తాం” అని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఎస్టీ కోటా కింద గుజర్లు, బకర్వాల్లు రిజర్వేషన్లు పొందుతున్నారు.
పహాడీలకు కూడా 4శాతం రిజర్వేషన్ ఉన్నది. దీంతో రిజర్వేషన్ల విషయంలో పహాడీలతో గుజర్లు, బకర్వాల్లకు తరుచుగా గొడవలు జరిగేవి. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం జస్టిస్ శర్మ కమిషన్ను ఏర్పాటు చేసింది. అధ్యయనం చేసిన కమిషన్ ఈ మూడు సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు (ఎస్టీ కోటా కింద) కల్పించాలని సూచించింది. దీనిపై ప్రభుత్వం న్యాయనిపుణులతో చర్చిస్తున్నది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాతే రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతాయని అమిత్ షా చెప్పారు. ఆర్టికల్ 370, 35ఏ లను తొలగించకుంటే గిరిజనులు రిజర్వేషన్లు పొందడం సాధ్యమయ్యేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు వాటిని తొలగించడంతో గిరిజనులు వారి హక్కులు పొందుతారని వెల్లడించారు. 70ఏళ్లుగా కశ్మీర్ ను మూడు కుటుంబాలే పాలించాయని.. ప్రజాస్వామ్యాన్ని వాళ్ల కుటుంబాలకే పరిమితం చేశారని విమర్శించారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక కశ్మీర్ లో విద్యార్థులకు స్కాలర్ షిపులు పెంచామని, 100కు పైగా కొత్త స్కూళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. హైవేల కోసం లక్ష కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఇవన్నీ ఆర్టికల్ 370 రద్దు తర్వాతే జరిగాయని గుర్తు చేశారు.
70ఏళ్లుగా కశ్మీర్ ను మూడు కుటుంబాలే పాలించాయని.. ప్రజాస్వామ్యాన్ని వాళ్ల కుటుంబాలకే పరిమితం చేశారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కశ్మీర్ లో విద్యార్థులకు స్కాలర్ షిపులు పెంచామని, 100కుపైగా కొత్త స్కూళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. హైవేల కోసం లక్ష కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఇవన్నీ ఆర్టికల్ 370 రద్దు తర్వాతే జరిగాయన్నారు.