ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒకచోటే పోటీ చేసేలా కేంద్ర ఎనిుకల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు కేంద్ర ఎన్నికల కమిషనరు రాజీవ్ కుమార్ లేఖ రాశారు. వచ్చే ఎన్నికల నుంచి ఈ నిర్ణయాలు అమలు చేసేలా ప్రయత్నించాలని లేఖలో సూచించారు.
ప్రస్తుతం ఎనిుకల్లో అర్హత ఉన్న ఒక అభ్యర్థి రెండు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. 2014, 2019 ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండేసి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. మోదీ వడోదర, వారణాసి నుంచి.. రాహుల్ గాంధీ అమేథీ, వయనాడ్ నుంచి పోటీ చేశారు.
కానీ భవిష్యత్లో ఇలాంటి పరిస్థితి లేకుండా చేసేందుకు చెక్ పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. కొన్ని సందర్భాల్లో అసెంబ్లీ లేదాలోక్సభ ఎన్నికల్లో రెండేసి స్థానాల్లో పోటీ చేయడమే కాకుండా పదవిలో ఉండగానే పార్లమెంటు సభ్యులు అసెంబ్లీ ఎన్నికల్లో, అసెంబ్లీకి ఎనిుకైనవారు లోక్సభకు పోటీ చేయడం వల్ల కూడా ఉప ఎన్నికలు అనివార్యం అవుతున్నాయి.
ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ అసెంబ్లీ లేదా లోక్సభ స్థానాల్లో పోటీ చేయకుండా ఆంక్షలు విధించాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. కానీ వివిధ కారణాలతో ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనను బుట్టదాఖలు చేశాయి. రెండు స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థి రెండు చోట్లా గెలుపొందితే, ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుండటంతో ఉప ఎన్నిక అనివార్యం అవుతోంది.
ఉప ఎన్నిక నిర్వహణ కోసం ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది. ఫలితంగా ప్రజాధనం వృథా అవుతుందను విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఒకే స్థానంలో పోటీ చేయాలనే నిబంధన తీసుకురావడం లేదా రెండు స్థానాల్లో గెలిచి ఏదోఒక స్థానానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంటే సదరు అభ్యర్థి నుంచి భారీ జరిమానా వసూలు చేసేలా నిబంధన తీసుకురావాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది.