భారతదేశంలో 5జీ సేవలను. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1న దేశంలో ప్రారంభించడంతో 5జీ నెట్వర్క్ ఉన్న అతికొద్ది దేశాల జాబితాలో భారతదేశం చేరింది. అయితే ఇంటర్నెట్ స్పీడ్ పరంగా మాత్రం బాగా వెనుకబడి ఉంది. ఇంటర్నెట్ వేగం గురించి సమాచారాన్ని అందించే ఊక్లా ఆగస్టు నెలకు సంబంధించిన స్పీడ్టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్లో 140 దేశాలలో భారతదేశం 117వ స్థానంలో ఉంది.
ఆగస్టులో భారతదేశంలో సగటు వేగం 13.52 ఎంబిపిఎస్. ఇది పాకిస్థాన్ కంటే తక్కువ. పాకిస్థాన్ ఈ నెలలో 14.22 ఎంబిపిఎస్ వేగంతో 116వ స్థానంలో ఉంది. నార్వే అత్యధిక ఇంటరొట్ వేగం కలిగి ఉంది. ఇక్కడ 122.77 ఎంబీపీఎస్ వేగం అందుబాటులో ఉంది. అమెరికాలో వేగం 61.95 ఎంబిపిఎస్ కాగా, చైనాలో 92.53 ఎంబిపిఎస్ ఉన్నది.
వినియోగదారుల కోసం చౌకగా డేటా ఉన్నప్పటికీ, భారతదేశంలో చాలా మందికి ఇంటర్నెట్ సదుపాయం లేదు. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఇంటర్నెట్ లేని 10 మందిలో నలుగురు దేశంలో ఉన్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నివేదిక ప్రకారం, ప్రతి వంద మందిలో 60 మందికి మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉంది.
గ్రామాల్లో 100 మందిలో 37 మందికి, నగరాల్లో 103 మందికి మాత్రమే ఇంటర్నెట్ అందుబాటులో ఉనుది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 (ఎన్ఎఫ్హెచ్ఎస్..5) నుంచి వచ్చిన డేటా ప్రకారం భారతదేశంలో కేవలం 49 శాతం కుటుంబాలకుమాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. భారతదేశంలో, ఇప్పటికీ 65 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు, దాదాపు 50 శాతం మంది పురుషులు ఇంటర్నెట్ ను ఉపయోగించడం లేదు.
ఇంటర్నెట్ చాలావరకు నగరాలకు పరిమితం అవుతుంది. గ్రామాల్లో 75 శాతం మంది మహిళలు , 57 శాతం మంది పురుషులు ఎప్పుడూ ఇంటర్నెట్ ఉపయోగించలేదని ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా చూపిస్తుంది. పెళ్లయిన వారితో పోలిస్తే పెళ్లి కాని యువతులు, పురుషులు ఇంటర్నెట్ వినియోగంలో ముందున్నారని ఈ సర్వే వెల్లడించింది.
29 శాతం వివాహిత స్త్రీలు, 48 శాతం పురుషులు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు, 50 శాతం కంటే ఎక్కువ అవివాహిత స్త్రీలు , 57 శాతం పురుషులు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. ట్రాయ్ నివేదిక ప్రకారం, మార్చి 2022 నాటికి దేశంలో 8 కోట్ల 25 లక్షల మంది ఇంటర్నెట్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీరిలో 7.96 కోట్ల మంది మొబైల్ ఇంటర్నెట్ సబ్స్క్రైబర్లు ఉన్నారు.
చాలా మంది వ్యక్తులతో ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉన్నందున ఈ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ట్రాయ్ డేటా ప్రకారం, గత నాలుగు త్రైమాసికాల నుంచి ఇంటర్నెట్ సబ్స్క్రైబర్ల సంఖ్య తగ్గుతోంది. వారిలో మొబైల్ ఇంటర్నెట్ చందాదారులు కూడా ఉన్నారు. జూన్ 2021లో మొబైల్ ఇంటర్నెట్ సబ్స్క్రైబర్ల సంఖ్య 8.94 కోట్లు, ఇది డిసెంబర్ 2021 నాటికి 8.15 కోట్లకు తగ్గింది . మార్చి 2022 నాటికి 7.96 కోట్లకు పడిపోయింది.
ఒకవైపు ఇంటర్నెట్ సబ్స్క్రైబర్ల సంఖ్య తగ్గిపోతుంటే మరోవైపు ప్రతి యూజర్ నుంచి టెలికాం కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నాయి. దీనినే వినియోగదారునికి సగటు ఆదాయం (ఏఆర్పీయూ) అంటారు. ట్రాయ్ ప్రకారం, మార్చి 2021లో, కంపెనీలు ఒక వినియోగదారు నుంచి రూ.104 సంపాదిస్తున్నాయి, ఇది మార్చి 2022లో రూ.127కి పెరిగింది.